AP Cabinet Meeting Highlights - 26/03/2026
ఏపీ
క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవే - 26/03/2026
====================
Cabinet Decisions - Press Briefing by
Sri. Kolusu Parthasarathy, Hon'ble Minister for Information and Public
Relations, Housing at Publicity Cell, Block-04, AP Secretariat on 26-03-2026
LIVE
ఏపీ
క్యాబినెట్ మీటింగ్ గురించి ప్రెస్ మీట్ ప్రత్యక్ష ప్రసార వివరాలు ఇవే
YouTube Link:
https://www.youtube.com/watch?v=aHDn96euDDU
====================
ఏపీ
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా
కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను సమావేశం అనంతరం మంత్రి పార్థసారథి ప్రెస్ మీట్ లో
వివరించారు.
కేబినెట్
నిర్ణయాలు ఇవే:
> రాజధాని
అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ. ఏపీ పునర్విభజన చట్టం 2014లోని సెక్షన్-5ను
సవరించాల్సిందిగా మంత్రివర్గం తీర్మానం చేసింది.
> కొత్త
రాజధాని స్థానంలో అమరావతి పేరును చేర్చాలని ప్రభుత్వం భావిస్తోంది.
> అంతేకాకుండా
నీరుకొండలో ఎస్ఆర్ఎం వర్సిటీ, 60 మీటర్ల ఎత్తు వరకు అకడమిక్ భవనాల నిర్మాణానికి క్యాబినెట్ అనుమతి ఇచ్చింది.
> రాష్ట్రంలో
96 జూనియర్, సీనియర్ సివిల్
జడ్జిల కోర్టుల ఏర్పాటుకు ఆమోదం.
> వడ్డెర
సంఘాలకు ప్రాధాన్యక్రమంలో ఖనిజ లీజులు కేటాయింపులపై చర్చ.
> ఖనిజ
లీజుల కేటాయింపులో ప్రీమియం, సీనరేజ్
ఫీజుల్లో 50 శాతం రాయితీ.
> కుప్పం
బాలికల పాఠశాలలో పీఈటీ, నర్సు, రికార్డు అసిస్టెంట్ పోస్టుల మంజూరుకు ఆమోదం.
> 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఆస్తి పన్ను బకాయిలపై వడ్డీ మాఫీ.
> జలవనరుల
శాఖలో వివిధ ప్రాజెక్టుల ఆధునికీకరణ, మరమ్మతులకు
పరిపాలన అనుమతులు.
> వివిధ
సంస్థలకు భూ కేటాయింపులపై నిర్ణయం తీసుకున్న రాష్ట్ర మంత్రివర్గం ఎలక్ట్రిక్
ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని మంత్రి వర్గం నిర్ణయించింది.
> కొత్త
రాజధానిగా సీఆర్డీఏ చట్టం పరిధిలోని అమరావతి పేరు చేర్చాలని క్యాబినెట్
తీర్మానించింది.
> ఎల్లుండి
(మార్చి 28) అసెంబ్లీలో 4 గంటలపాటు చర్చించి తీర్మానించాలని నిర్ణయించింది.
> రాజధాని
చరిత్రను ప్రజలకు తెలియ జేయాలని సీఎం చంద్రబాబు క్యాబినెట్ కు సూచించారు.
> క్యాబినెట్
సమావేశంలో భాగంగా విద్యుత్ వ్యవస్థపై ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
> ఏప్రిల్
5 నుంచి 14 లోపు ప్రతి
నియోజకవర్గంలో 2 వేల చొప్పున సూర్యఘర్ కనెక్షన్లు
ఇవ్వాలని నిర్ణయించారు.
> పీఎం
కుసుమ్ ద్వారా పవర్ లాస్లు తగ్గించేలా చూడాలని దిశానిర్దేశం చేశారు.
> బ్యాటరీ
స్టోరేజ్ వ్యవస్థల్ని 33/11 కేవీ సబ్స్టేషన్ల
వద్ద ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
> సాంకేతికత
అందిపుచ్చుకుంటూ సంస్కరణలు తీసుకొస్తూ విద్యుత్ శాఖ ముందుకెళ్లాలని సూచించారు.
====================

0 Komentar