Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Sending money is tax deductible - Double tax if not PAN / Aadhaar




Sending money is tax deductible - Double tax if not PAN / Aadhaar
డబ్బులు పంపితే పన్ను బాదుడు, పాన్/ఆధార్ లేకపోతే డబుల్ ట్యాక్స్, వారందరికీ భారీ షాక్!
డబ్బులు పంపాలని యోచిస్తున్నారా? విదేశాల్లో ఉన్న వారికి మనీ ట్రాన్స్‌ఫర్ చేయాలా? అయితే మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఇకపై పన్ను బాదుడు మొదలవనుంది.

ప్రధానాంశాలు:
కేంద్రం కొత్త రూల్, వచ్చే నెల నుంచి అమలులోకి
కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్ తీసుకువచ్చింది. అక్టోబర్ 1 నుంచి ఇది అమలులోకి వస్తుంది. దీంతో మనీ ట్రాన్స్‌ఫర్‌పై పన్ను బాదుడు మొదలవుతుంది. అయితే ఇది అందరికీ కాదు. కొందరికే వర్తిస్తుంది. విదేశీ మనీ ట్రాన్స్‌ఫర్‌పై ఈ ట్యాక్స్ పడుతుంది. అంటే మన దేశం నుంచి విదేశాల్లో ఉన్న వారికి డబ్బులు పంపే వారిపై ప్రతికూల ప్రభావం పడనుంది.

రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) లిబరలైజర్డ్ రెమిటెన్స్ స్కీమ్ ప్రకారం.. ఇప్పుడు మన దేశం నుంచి విదేశాల్లో ఉన్న వారు ఎవరికైనా ప్రతి ఏడాది 2,50,000 డాలర్లను పంపొచ్చు. ఫైనాన్స్ యాక్ట్ 2020 ప్రకారం ఇలా పంపే డబ్బులపై వచ్చే నెల నుంచి టీసీఎస్ (ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్) కట్ అవుతుంది. 5 శాతం పన్ను పడుతుంది.

ఫారిన్ టూర్ ప్యాకేజీలకు కూడా టీసీఎస్ వర్తిస్తుంది. ఎవరికీ ఎలాటి పన్ను మినహాయింపు ఉండదు. అయితే ఇక్కడ కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఒక ఆర్థిక సంవత్సరంలో రెమిటెన్స్‌ విలువ రూ.7 లక్షలు దాటితేనే ఇలా ట్యాక్స్ పడుతుంది. 5 శాతం ట్యాక్స్ కట్టాలి. అదే ఒకవేళ పాన్ కార్డు లేదా ఆధార్ కార్డు సమర్పించకపోతే ఈ ట్యాక్స్ డబుల్ అవుతుంది. అంటే 10 శాతం టీసీఎస్ అవుతుంది.

అదే ఒకవేళ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్ నుంచి ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటే ఆ డబ్బును విదేశాల్లో చదువుతున్న మీ పిల్లలకు పంపితే టీసీఎస్‌పై 0.5 శాతం రాయితీ లభిస్తుంది. అలాగే సెంట్రల్ గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు, విదేశీ డిప్లమ్యాటివ్ రెమిటర్స్‌కు మినహాయింపు ఉంది. టీసీఎస్ అకౌంట్‌కు జీఎస్‌టీ ఉండదు. ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్‌లో టీసీఎస్‌ను క్లెయిమ్ చేసుకోవచ్చు. 

విదేశాల్లో చదువుకునే భారతీయ విద్యార్థులు, విదేశాలకు వెళ్లే ఇండియన్ టూరిస్ట్‌లు, విదేశాల్లో ఉన్న స్టాక్ మార్కెట్స్, బాండ్లు, ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేసే ఇండియన్స్ వంటి వారిపై ప్రతికూల ప్రభావం పడనుంది. ఐటీఆర్ రూపంలో టీసీఎస్ రిఫండ్ పొందినా కూడా విదేశీ విద్యా, ప్రయాణం భారం పెరగనుంది. టూర్ అండ్ ట్రావెల్ ఏజెంట్లపై కూడా ఎఫెక్ట్ పడనుంది. టీసీఎస్ తప్పించుకోవడానికి టూరిస్ట్‌లు ప్యాకేజీ కాకుండా సొంతంగానే బుకింగ్స్ చేసుకుంటారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags