Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Andhra Bank

Andhra Bank


ఆంధ్రా బ్యాంకు
  భారతదేశపు వాణిజ్య బ్యాంకులలో ఆంధ్రా బ్యాంకు ఒకటి. ఈ బ్యాంకును 1923, నవంబరు 20న ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు, మేధావి, బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన భోగరాజు పట్టాభి సీతారామయ్య మచిలీపట్నంలో స్థాపించాడు. 1980లో ఈ బ్యాంకు జాతీయం చేశారు. 1981లో క్రెడిట్ కార్డు లను జారీ చేయుటం ద్వారా భారత దేశానికి క్రెడిట్ కార్డు వ్యవస్థను ఈ బ్యాంకు పరిచయం చేసింది. 2003 నాటికి నూరు శాతం కంప్యూటరీకరణ సాధించింది. 2007లో బయోమెట్రిక్ ఏటిఎంలను భారతదేశానికి పరిచయం చేసింది. 2007 సెప్టెంబర్ నాటికి ఈ బ్యాంకు 1,289 (గ్రామీణ-396, Semi-urban-376, పట్టణ-338, మెట్రో-179) బ్రాంచీలతో 99 ఎక్స్‌టెన్షన్ శాఖలతో, 37 శాటిలైట్ ఆఫీసులతో, 505 ఏటిఎంలతో, 22 రాష్ట్రాలలో, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలలో విస్తరించి ఉంది.
పెట్టుబడులను రాబట్టటంలో ఈ బ్యాంకు ఆసియాలోనే ప్రథమ స్థానంలో ఉంది. భారతదేశం మొత్తంలో ఈ బ్యాంకుకు 1,30,000 షేర్‌హోల్డర్స్, 1.372 కోట్ల ఖాతాదారులు ఉన్నారు. ప్రారంభం నుండి నేటి వరకు మొత్తం ఋణాలలో కనీసం 50 శాతానికి తగ్గకుండా ఋణాలను గ్రామీణ భారతానికే అందిస్తున్న బ్యాంక్ ఇది. దేశంలో బ్యాంకుల జాతీయం చేసిన తర్వాత క్రమబద్దంగా నడుస్తున్న జాతీయ బ్యాంకులలో ఇది ప్రధానమైనది.
ఇదిలా ఉండగా 30 ఆగస్టు 2019 న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆంధ్రబ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్ లను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం చేయనున్నట్లు ప్రకటించారు. ప్రతిపాదిత విలీనం 14.59 లక్షల కోట్ల ఆస్తులు, 9,609 శాఖలతో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశంలో ఐదవ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా అవతరిస్తుంది. ఈ విలీనానికి ఆంధ్ర బ్యాంక్ డైరెక్టర్ల బోర్డు 2019 సెప్టెంబర్ 13 న ఆమోదం తెలిపింది. ఈ విలీనంతో 2020 మార్చి 31 నుండి  ఆంధ్రబ్యాంక్ కనుమరుగు కానున్నది.

Previous
Next Post »
0 Komentar

Google Tags