Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Good news to taxpayers


పన్ను చెల్లింపుదారులకు ఊరటనిచ్చిన కేంద్రం..
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ‘ఆత్మ నిర్భర భారత్‌ అభియాన్‌’ ప్యాకేజీ కింద పన్ను చెల్లింపుదారులకు ఊరట కల్పించారు. ప్రస్తుతం ఉన్న టీడీఎస్‌(ట్యాక్స్‌ డిడక్షన్‌ ఎట్‌ సోర్స్‌), టీసీఎస్‌(ట్యాక్స్‌ కలక్షన్‌ ఎట్‌ సోర్స్‌) ను 25 శాతం మేర తగ్గించారు. ఒప్పంద, వృత్తిగత ఫీజులు, వడ్డీ, అద్దె, డివిడెండ్‌, కమీషన్‌, బ్రోకరేజ్‌ మొదలైనవి ఈ తగ్గిన రేటుకు అర్హులు. ఇది నేటి నుంచి అమల్లోకి వస్తుందన్నారు. ఆర్థిక సంవత్సరం 31, మార్చి 2021 వరకు కొనసాగనున్నట్లు తెలిపారు. 25 శాతం తగ్గింపుతో లక్షలాది మంది ఉద్యోగులకు, ప్రజలకు రూ. 50 వేల కోట్ల మేర లబ్ది చేకూరి నగదు లభ్యతకు ఆస్కారం ఉంటుందన్నారు. 
3 లక్షల రూపాయల నుంచి 5 లక్షల రూపాయల వరకూ జీతం ఉన్న వారికి 5 శాతం టీడీఎస్ ఉంది. 5లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయల వరకూ జీతం ఉన్న ఉద్యోగులకు 20 శాతం వరకూ టీడీఎస్ ఉంది. సంవత్సరానికి పది లక్షల రూపాయలకు మించి జీతం ఉన్న వారు 30 శాతం టీడీఎస్ ఉంది. ఈ తరుణంలో 2020-21లో టీడీఎస్‌లో 25 శాతం మినహాయింపునిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.

Previous
Next Post »
0 Komentar

Google Tags