Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

E-Service Register (E-SR) Full details

ఉద్యోగుల సమాచారం డిజిటలీకరణ
ఇక ఎవరి ప్రమేయం లేకుండా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ జీతభత్యాలు చెల్లించేందుకు ఆర్థిక శాఖ.. హ్యూమన్  క్యాపిటల్ మేనేజ్మెంట్ (హెచ్ సీఎం) వ్యవస్థను అమలు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే ఆర్థిక శాఖ అనుబంధ విభాగాల ఉద్యోగులకు ఈ వ్యవస్థ ద్వారా జీతభత్యాలను చెల్లిస్తోంది. దశల వారీగా మిగతా శాఖల ఉద్యోగులందరికీ ఈ వ్యవస్థ ద్వారానే జీతభత్యాలు చెల్లించేందుకు చర్యలు చేపట్టింది. ఉద్యోగుల నియామకం నుంచి పదవీ విరమణ వరకు డిజిటలీకరణ చేయనున్నారు.
>ఈ వ్యవస్థ అందుబాటులోకి వస్తే ఉద్యోగులు తమ జీతభత్యాల కోసం డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్స్ (డీడీవోలు) చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు.
>ఈ ప్రక్రియలో ఉద్యోగుల ఇంక్రిమెంట్, ప్రమోషన్, వంటి ప్రతి అంశాన్ని నమోదు చేస్తారు. దీనివల్ల జాప్యం లేకుండా ప్రతి పని నిర్ణీత వ్యవధిలో పూర్తవుతుంది
>పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు అందాల్సిన ప్రయోజనాల తోపాటు మిగతా ఉద్యోగులకు సంబంధించిన అంశాలకు కాలక్రమంలో నిర్ణీత గడువును నిర్ధారించుకున్నారు
>ఉద్యోగుల సర్వీసు పుస్తకాలన్నింటినీ కంప్యూటరీకరించడంతో అందులో ఉన్న వివరాలన్నీ ప్రభుత్వ వెబ్ సైట్ లో ఉంటాయి.
>ప్రతి నెలా ఉద్యోగులకు రావాల్సిన పరిహారాలు ఆటోమేటిక్ గా జనరేట్ అవుతాయి.
>దీని కోసం రూపొందించిన సాఫ్ట్వేర్ ఆధారంగా ఉద్యోగుల జీతాలే కాకుండా ఇంక్రిమెంట్లు, ఎన్క్యాష్ మెంట్ లీవులు వంటివన్నీ ఏ నెలకానెల నమోదవుతాయి.
>తనకు ఇంక్రిమెంట్ కావాలని, జీతాలు పెంచాలని ఉద్యోగులు కోరుకునే పరిస్థితి ఉండదు.
>ప్రభుత్వం కరువు భత్యం పెంచితే తక్షణం ఉద్యోగుల ఖాతాలో జమ అవుతుంది.
తేది. 13 జూన్ 2020 నాటి ‘సాక్షి’ దినపత్రిక సౌజన్యంతో..
Previous
Next Post »
0 Komentar

Google Tags