Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Key changes in the intermediate education of AP

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యలో రానున్న కీలక మార్పులు..
వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్‌ విద్యలో  సీబీఎస్‌ఈ తరహాలో  అనేక సంస్కరణలను ఇంటర్‌ విద్యామండలి తీసుకొస్తోంది. అవి..
>ప్రశ్నల సంఖ్యను పెంచి, మార్కులను తగ్గిస్తారు. పుస్తకంలోని అన్ని అధ్యాయాల నుంచి ప్రశ్నలు వస్తాయి.
>విద్యార్థులు అన్ని అంశాలూ నేర్చుకోవడం వల్ల ఎంసెట్‌, జేఈఈ, నీట్‌లకు కోచింగ్‌ తీసుకోవాల్సిన అవసరం ఉండదు.
>ఒక్కో సెక్షన్‌కు 40మందికే పరిమితం, అలాగే ఒక్కో కళాశాలకు అన్ని గ్రూపులూ కలిపి గరిష్ఠంగా 9 సెక్షన్లకే అనుమతి.
>ప్రైవేటు, కార్పొరేట్‌ కళాశాలల రుసుములను కమిషన్‌ నిర్ణయించి ఆన్‌లైన్‌లో విద్యార్థులకు అందుబాటులో ఉంచుతారు.
>ఇంటర్‌ ప్రవేశాలు, ధ్రువపత్రాల పరిశీలన అంతా ఆన్‌లైన్‌లోనే. అలాగే సీట్ల కేటాయింపులో రిజర్వేషన్‌ అమలవుతుంది.
> పనివేళలు ఉదయం 8.30 నుంచి సాయంత్రం 3.30 వరకు తరగతులు, మరో గంటపాటు క్రీడలు, ఇతర కార్యక్రమాల నిర్వహణకు నిర్ణయం.
>వారంలో ఒకటి, రెండు రోజులు చర్చా వేదికలు, సెమినార్లు.
>ఎంసెట్‌, జేఈఈ, నీట్‌, ఇతరత్రా శిక్షణలకు కళాశాలలు ప్రత్యేక అనుమతి తీసుకోవాలి. ఈ శిక్షణ రుసుములను పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ నిర్ణయిస్తుంది.
>ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించి నివేదికల వివరాలను వెబ్‌సైట్‌లో తల్లిదండ్రులకు అందుబాటులో ఉంచుతారు.
>ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో 20 మంది విద్యార్థుల కంటే తక్కువగా ఉన్న గ్రూపులను మూసేస్తారు.
>విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభమైనా ఇబ్బంది లేకుండా ఉండేందుకు వీడియా పాఠాలను రూపొందిచి వెబ్‌సైట్‌లో ఉంచుతారు.
Previous
Next Post »
0 Komentar

Google Tags