Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Changes in the JEE Advanced Eligibility Criteria 2020

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ అర్హత నిబంధనల్లో మార్పులు
జేఈఈ అడ్వాన్స్‌డ్‌ అర్హత నిబంధనల్లో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మార్పులు చేసింది. ఇంటర్‌లో 75 శాతం మార్కులుండాలన్న అర్హత నిబంధనను తొలగించింది. ఇంటర్‌ లేదా 10+2లో ఉత్తీర్ణులైన అందరినీ అర్హులుగా నిర్ణయించింది. కరోనా మహమ్మారి కారణంగా పలు బోర్డులు ఇంటర్మీడియట్ పరీక్షలను పాక్షికంగా రద్దు చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ఐఐటీల్లో ప్రవేశం పొందేందుకు జేఈఈ అడ్వాన్స్ లో ఉత్తీర్ణత సాధించడంతో పాటు, క్లాస్ 12 బోర్డ్ పరీక్షలో కనీసం 75% మార్కులు కానీ, లేదా సంబంధిత అర్హత పరీక్షలో టాప్ 20 పర్సంటైల్ ర్యాంక్ కానీ సంపాదించాల్సి ఉంటుంది. జేఈఈ అడ్వాన్స్ కు జేఈఈ మెయిన్స్ అర్హత పరీక్షగా పరిగణిస్తారన్న విషయం తెలిసిందే. కరోనా కారణంగా ఈ నిబంధనలకు తాజాగా సడలింపును ఇస్తున్నట్లు కేంద్ర హెచ్చార్టీ మంత్రి రమేశ్ తెలిపారు. జేఈఈ మెయిన్స్ ఈ సంవత్సరం సెప్టెంబర్ 1 నుంచి 6 వరకు, జేఈఈ అడ్వాన్స్ సెప్టెంబర్ 27న నిర్వహించనున్నారు.
Previous
Next Post »
0 Komentar

Google Tags