Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

New education policy, teachers will have no extra-curricular duties

నూతన విద్యా విధానం ప్రకారం ఉపాధ్యాయులకు బోధనేతర విధులుండవు
-రాష్ట్రాల్లో కొత్తగా పాఠశాలల ప్రామాణాల ప్రాధికారిక సంస్థ ఏర్పాటు
-పనితీరు ఆధారంగా పాఠశాలలకు అక్రిడేషన్‌ విధానం
నూతన విద్యావిధానం ప్రకారం ఉపాధ్యాయ శిక్షణ నుంచి పాఠశాలల నిర్వహణ, నియంత్రణ విషయాల్లో కొత్త విధానాలు అమల్లోకి రానున్నాయి. పాఠశాల విద్యాశాఖ ఇక మీదట విధానాల రూపకల్పనకు మాత్రమే పరిమితమవుతుంది. బోధనేతర వ్యవహారాల కోసం ఉపయోగించకూడదు. రాష్ట్రాల్లో కొత్తగా పాఠశాలల ప్రామాణాల ప్రాధికారిక సంస్థ ఏర్పాటవుతుంది. ఇకపై పనితీరు ఆధారంగా పాఠశాలలకు అక్రిడేషన్‌ విధానం అమలుకానుంది.
>తక్కువ మంది విద్యార్ధులు ఉండే పాఠశాలలను కలిపి ఒక చోట స్కూల్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటు చేయాలి.
>ఒక్కో స్కూల్‌కాంప్లెక్స్‌లో ఒక మాధ్యమిక పాఠశాలతోపాటు, ప్రాథమిక పాఠశాలలు ఉండాలి.
>విద్యా శాఖను కేవలం విధానాల రూపకల్పన, పర్యవేక్షణకు మాత్రమే పరిమితం చేయాలి.  పాఠశాలల నియంత్రణలో అది జోక్యం చేసుకోకూడదు.
>రాష్ట్ర  ప్రభుత్వాలు నిర్దేశించిన ప్రత్యేక పరిస్థితులు మినహా మిగతా విషయాల ఆధారంగా వారిని బదిలీ  చేయకూడదు.
>ఉపాధ్యాయులకు నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ కార్యక్రమం అమల్లోకి వస్తుంది. 
>టీచర్లు ఏటా కనీసం 50 గంటలపాటు వృత్తినైపుణ్య శిక్షణ పూర్తిచేయాలి.

Previous
Next Post »
0 Komentar

Google Tags