Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Change in bus seating policy - RTC took a key decision


Change in bus seating policy - RTC took a key decision
ఏపీ ప్రజలకు ఆర్టీసీ అలర్ట్.. బస్సుల సీటింగ్ విధానంలో మార్పు!
లాక్‌డౌన్‌ తర్వాత మే 21 నుంచి ఆర్టీసీ సర్వీసులను పునరుద్ధరించినా.. కొవిడ్‌ నిబంధనల దృష్ట్యా సగం సీట్లకే అనుమతిచ్చారు. ఆన్‌లైన్‌లో సగం సీట్లే అందుబాటులో ఉండేలా సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేశారు.

ఏపీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ బస్సుల్లో ఇకపై సీట్ల పూర్తి సామర్థ్యం మేర ప్రయాణికులను అనుమతించాలని ఆర్టీసీ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ అయ్యాయి. లాక్‌డౌన్‌ తర్వాత మే 21 నుంచి ఆర్టీసీ సర్వీసులను పునరుద్ధరించినా.. కొవిడ్‌ నిబంధనల దృష్ట్యా సగం సీట్లకే అనుమతిచ్చారు. ఆన్‌లైన్‌లో సగం సీట్లే అందుబాటులో ఉండేలా సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేశారు. కానీ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం పూర్తి సామర్థ్యం మేర సీట్లు కేటాయించాలని నిర్ణయించారు. దీంతో ఆన్‌లైన్‌లో అన్ని సీట్లు అందుబాటులోకి వచ్చేలా మార్పులు చేయనున్నారు.

కరోనా, లాక్‌డౌన్ కారణంగా మార్చి నెలాఖరు నుంచి మే 21 వరకు బస్సుల్ని అనుమతించలేదు. తిరిగి మే 21న ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. అయితే సిటీ బస్సు సర్వీసుల్ని మాత్రం పునరుద్ధరించలేదు. కానీ సెప్టెంబర్ 19 నుంచి విజయవాడ, విశాఖపట్నంలలో సిటీ సర్వీసుల్ని ప్రారంభించారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా మరికొన్ని చోట్ల సర్వీసులు ప్రారంభమయ్యాయి. మిగిలిన పట్టణాలు, నగరాల్లో కూడా సర్వీసులు ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నారు. భౌతిక దూరం పాటిస్తూ మాస్క్‌లు, శానిటైజర్ వంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
Previous
Next Post »
0 Komentar

Google Tags