JEE Mains results on 11th - Released primary 'key’
రేపు జేఈఈ మెయిన్స్ ఫలితాలు - విడుదలైన
ప్రాథమిక 'కీ
అభ్యంతరాల దాఖలుకు నేటివరకే గడువు
ప్రతి ప్రశ్నకు రూ.200 చొప్పున చెల్లించాలి
రాష్ట్ర, ఆల్
ఇండియా వారీగా ర్యాంకుల ప్రకటన
ఐఐటీ, ఎస్ఎటీ,
ఐఐ ఎస్ఈఆర్ తదితర జాతీయ విద్యాసం సల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్స్ తుది ఫలితాలు ఈనెల 11న విడుదలయ్యే అవకాశముంది. కోవిడ్ కారణంగా వాయిదాపడ్డ రెండో విడత జేఈఈ మెయిన్స్
పరీక్షలు ఈనెల 1 నుంచి 6 వరకు జరిగిన
సంగతి తెలిసిందే. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) విధానంలో నిర్వహించిన ఈ
పరీక్షలకు దేశవ్యాప్తంగా 8,58,395 మంది విద్యార్థులు నమోదు
చేసుకున్నా రు. రాష్ట్రంలో 82,748 మంది రిజిస్టర్ చేసుకోగా 52
కేంద్రాలలో పరీక్ష నిర్వహించారు.
జేఈఈ మెయిన్స్ జవాబుల 'కీ'ని నేషనల్ టె స్టింగ్ ఏజెన్సీ మంగళవారం రాత్రి అధికారిక వెబ్ సైట్లో
పొందుపరిచింది. దీనిపై అభ్యంతరాల దాఖలుకు గురువారం వరకు ఆన్లైన్లో అవకాశం
కల్పించారు. ప్రతి ప్రశ్నకు రూ.200 చొప్పున ప్రాసెసింగ్ ఫీజు
డెబిట్, క్రెడిట్ కార్డులు, నెట్
బ్యాంకింగ్ ద్వారా చెల్లించాలి. జవాబుల కీని 'జేఈఈఎంఏఐఎన్.ఎన్టీఏ.ఎసీ.
ఐఎస్ వెబ్ సైట్లో పొందుపర్చారు. అభ్యర్థులు ప్రశ్నపత్రం, రెస్పాటను
భద్రపర్చుకోవాలి.
జేఈఈ మెయిన్స్ ఫలితాలను త్వరలోనే
ప్రక టించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ సోషల్ మీడియాలో
తెలిపారు. ఈ ప్రక్రియ ఇప్ప టికే ప్రారంభమైందని వివరించారు. 11న ఫలితాలు ప్రకటించే అవకాశముందని
భావిస్తున్నారు.
ఫలితాలు ప్రకటించాక కటాఫ్ మార్కుల
ఆధారంగా అర్హత సాధించిన అభ్యర్థులలో మెరిట్లో ముందున్న 2.50 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్ పరీక్షలకు అనుమతిస్తారు. వీరికి ఐఐటీల్లో
ప్రవేశం కల్పిస్తారు. మిగతావారు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఏటీ),
గవర్నమెంటు ఫండెడ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ (జీఎఫ్ టీఐ) తదితర
సంస్థల్లో ప్రవేశాలకు అర్హులు. జేఈఈ అడ్వాన్స్ కు సంబంధించి నోటిఫికేషన్ ఇంకా
వెలువడాల్సి ఉంది. ఈ పరీక్షను ఈసారి ఢిల్లీ ఐఐటీ ఈనెల 27వ
తేదీన నిర్వహించే అవకాశం ఉంది. ఇప్పటికే బ్రోచర్ కూడా విడుదలైంది.
జేఈఈ మెయిన్స్ కీ విడుదల కాగానే
అభ్యర్థులు తమకు వచ్చిన మార్కుల ఆధారంగా ర్యాంకులను అంచనా వేసే వీలుంది. గతంలో ఏ
ర్యాంకు వరకు సీట్ల కేటాయింపు ర్యాంకులను చేశారో జేఈఈ వెబ్ సైట్లోనే ఉన్నందున దీని
ఆధారంగా ఒక అంచనాకు రావచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. క్వాలిఫైయింగ్ కటాఫ్
మార్కులు సాధించిన అభ్యర్థులు అంచనా ర్యాంకుల జాబితాలో ఉంటారు. వీటిని రాష్ట్ర, ఆల్
ఇండియా ర్యాంకులుగా ఇస్తారు.
0 Komentar