Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Nirmala Sitharaman good news for bank customer - New services from October 1




Nirmala Sitharaman good news for bank customers - New services from Oct 1
బ్యాంక్ ఖాతాదారులకు నిర్మలా సీతారామన్ శుభవార్త.. అక్టోబర్ 1 నుంచి కొత్త సర్వీసులు!
అక్టోబర్ 1 నుంచి ఫైనాన్షియల్ సర్వీసులకి కూడా డోర్స్టెప్ బ్యాంకింగ్ 
బ్యాంక్ ఖాతాదారులకు మరీ ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంక్ కస్టమర్లకు నిర్మలా సీతారామన్ శుభవార్త అందించారు. వచ్చే నెల నుంచి కొత్త సర్వీసులు అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ప్రకటించారు. 
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా బ్యాంక్ కస్టమర్లకు గుడ్ న్యూస్ అందించింది. డోర్ స్టెప్ బ్యాంకింగ్ సర్వీసులను లాంచ్ చేశారు. ప్రభుత్వ రంగ బ్యాంకులకు (PSBs) ఇది వర్తిస్తుంది. ఈ కొత్త సర్వీసులతో బ్యాంక్ కస్టమర్లు ఇంటి నుంచే బ్యాంకింగ్ సర్వీసులు పొందొచ్చు. బ్యాంకుకు వెళ్లాల్సిన పని లేదు. కరోనా వైరస్ సమయంలో ఈ సర్వీసుల వల్ల ఖాతాదారులకు ఊరట కలుగనుంది.
ఎన్‌హ్యాన్స్‌డ్ యాక్సెస్ అండ్ సర్వీస్ ఎక్సలెన్స్ రిఫార్మ్స్ (EASE Reforms)లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ సేవలు అందుబాటులోకి తీసుకువస్తోంది. అక్టోబర్ 1 నుంచి పీఎస్‌బీ డోర్ స్టెప్ బ్యాంకింగ్ సర్వీసులు కస్టమర్లకు అందుబాటులోకి వస్తాయి. ప్రస్తుతం ఇప్పుడు కూడా డోర్‌స్టెప్ బ్యాంకింగ్ (ఇంటి వద్దకే బ్యాంక్ సేవలు) అందుబాటులో ఉన్నాయి. అయితే నాన్ ఫైనాన్షియల్ సర్వీసులు మాత్రమే. 
అయితే అక్టోబర్ 1 నుంచి ఫైనాన్షియల్ సర్వీసులు కూడా ఇంటి వ్దదనే పొందొచ్చు. నాన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కింద డిమాండ్ డ్రాఫ్ట్ పికప్, పే ఆర్డర్స్ పికప్, ఫామ్ 15హెచ్/15జీ పికప్, జీఎస్‌టీ చాలన్ పికప్, అకౌంట్ స్టేట్‌మెంట్ డెలివరీ, టర్మ్ డిపాజిట్ రశీదు ఇవ్వడం వంటి పలు రకాల సేవలను ఇంటి వద్దనే పొందొచ్చు. ఇకపై ఫైనాన్షియల్ సర్వీసులు కూడా లభిస్తాయి.
 ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందిన కస్టమర్లు నామమాత్రమపు ఫీజు చెల్లించి ఇంటి వద్దనే ఫైనాన్షియల్ సర్వీసులు పొందొచ్చు. సీనియర్ సిటిజన్స్, వికలాంగులు కూడా డోర్‌స్టెప్ బ్యాంకింగ్ సర్వీసులు పొందే ఛాన్స్ ఉంది. ప్రభుత్వ రంగ బ్యాంకులకు సంబంధించిన కస్టమర్లు ఇంటి వద్దనే సౌకర్యవంతంగా బ్యాంకింగ్ సేవలు పొందాలనేది ఈ డోర్‌స్టెప్ బ్యాంకింగ్ సర్వీసుల అధిక లక్ష్యమని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. 
కాల్ సెంటర్, వెబ్ పోర్టల్, మొబైల్ యాప్ ద్వారా బ్యాంక్ కస్టమర్లు డోర్‌స్టెప్ సర్వీసులు పొందొచ్చు. డోర్‌స్టెప్ బ్యాంకింగ్ ఏజెంట్లు ఖాతాదారులకు వారు కోరిన సర్వీసులను అందిస్తారు. బ్యాంకులు వారి ప్రణాళికలను మరోసారి సమీక్షించుకొని, ప్రస్తుత పరిస్థితుల్లో కస్టమర్ల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని నిర్మలా సీతారామన్ తెలిపారు. అలాగే బ్యాంకులు ప్రభుత్వ పథకాలను బాగా అమలు చేయాలని తద్వారా ప్రజలకు ప్రయోజనం కలిగించాలని వివరించారు. కస్టమర్లకు రుణాలు అందించడం, దీని ద్వారా వడ్డీ ఆదాయం పొందటం అనేది బ్యాంకుల ప్రాథమిక లక్ష్యమని గుర్తుచేశారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags