Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Clarity on degree and PG exams, No interference in Govt policy decisions: HC




TS: Clarity on degree and PG exams, No interference in Govt policy decisions: HC
డిగ్రీ, పీజీ పరీక్షలపై స్పష్టత - ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేం: హైకోర్టు 
చివరి సెమిస్టర్‌ పరీక్షల నిర్వహణపై తెలంగాణ హైకోర్టులో విచారణ ముగిసింది. ‘‘చివరి సెమిస్టర్‌కు ఎప్పటిలాగే రాతపరీక్ష నిర్వహిస్తాం. అటానమస్‌ కళాశాలలు వారికి అనుకూలమైన రీతిలో పరీక్షలు నిర్వహించుకోవచ్చు. సప్లమెంటరీలో ఉత్తీర్ణులైన వారినీ రెగ్యులర్గా పాసయినట్టు పరిగణిస్తాం’’ అని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.  ‘‘పరీక్షలు ఎలా నిర్వహించాలనేది ప్రభుత్వ విధాన పరమైన నిర్ణయం. కాబట్టి ప్రభుత్వ నిర్ణయంలో జోక్యం చేసుకోలేము’’ అని హైకోర్టు పేర్కొంది. పరీక్షలను కరోనా నిబంధనలతో నిర్వహించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. రేపు జేఎన్టీయూహెచ్, ఎల్లుండి ఓయూ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభంకానున్న విషయం తెలిసిందే.

Previous
Next Post »
0 Komentar

Google Tags