Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP EAMCET-2020 Results Declared - Second List for Supplementary Students

 


AP EAMCET-2020 Results Declared - Second List for Supplementary Students

ఏపీ ఎంసెట్‌–2020 ఫలితాలు - సప్లిమెంటరీ విద్యార్థులకు రెండో జాబితాలో ర్యాంకులు

 

ఇంజినీరింగ్‌లో 84.78 శాతం ఉత్తీర్ణత

అగ్రికల్చర్‌, మెడిసిన్‌లో 91.77 శాతం ఉత్తీర్ణత

సప్లిమెంటరీ విద్యార్థులకు రెండో జాబితాలో ర్యాంకులు 

ఏపీ ఎంసెట్‌–2020 ఫలితాలు శనివారం విడుదల అయ్యాయి. రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా తదితర కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఎంసెట్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ విడుదల చేశారు. ఇంజినీరింగ్‌లో 84.78 శాతం, అగ్రికల్చర్‌, మెడిసిన్‌ విభాగంలో 91.77 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి వెల్లడించారు. విద్యార్థుల మొబైల్‌ నంబర్లకు కూడా ర్యాంకుల వివరాలు వస్తాయని మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు.

ఆన్‌లైన్‌ (సీబీటీ) విధానంలో జరిగిన ఈ పరీక్షలను హైదరాబాద్‌తో పాటు ఏపీలోని మొత్తం 47 నగరాల్లో 118 కేంద్రాల్లో నిర్వహించారు. గత నెల సెప్టెంబర్‌ 17వ తేదీ నుంచి 25 వరకు ఉదయం, మధ్యాహ్నం మొత్తం 14 సెషన్లలో పరీక్షలు జరిగాయి. 9 సెషన్లలో జరిగిన ఇంజనీరింగ్‌ విభాగానికి 1,85,946 మంది దరఖాస్తు చేయగా 1,56,899 మంది (84.38 శాతం) పరీక్ష రాశారు. ఈనెల 23వ తేదీ నుంచి 25 వరకు అగ్రి, మెడికల్‌ విభాగం పరీక్షలు జరగ్గా మొత్తం 87,652 మందికి గాను 75,834 (86.52%) మంది హాజరయ్యారు. ఇంజనీరింగ్‌ విభాగంతో  1,33,066 మంది విద్యార్థులు, అగ్రికల్చర్‌, మెడిసిన్ విభాగంలో 69,616 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 

సప్లిమెంటరీ విద్యార్థులకు రెండో జాబితాలో ర్యాంకులు

సప్లిమెంటరీ విద్యార్థులకు రెండో జాబితాలో ర్యాంకులు ఈ ఏడాది మార్చిలో నిర్వహించిన ఇంటర్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి మాత్రమే ఎంసెట్ ర్యాంకులను ఖరారు చేశారు. ఆ పరీక్షల్లో ఫెయిలై అడ్వాన్సు సప్లిమెంటరీ పరీక్షలకు దరఖాస్తు చేసిన వారికి రెండో జాబితాలో ర్యాంకులను ప్రకటించను న్నారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags