Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Civil Services Preliminary – 2020 exam today



Civil Services Preliminary –2020 exam today
నేడు సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమినరీ–2020 పరీక్ష 
యూపీఎస్సీ ఆధ్వర్యంలో ఆదివారం సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమినరీ–2020 పరీక్ష  జరుగనుంది. తెలంగాణలోని హైదరాబాద్, వరంగల్‌ కేంద్రాలలో ఈ పరీక్ష నిర్వహించనున్నారు. ఇందుకోసం మొత్తం 115 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లో 99 పరీక్షా కేంద్రాలలో 46,171 మంది పరీక్ష రాయనున్నారని హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్, ఎన్నికల కో–ఆర్డినేటింగ్‌ సూపర్‌వైజర్‌ శ్వేతా మహంతి తెలిపారు.

అలాగే వరంగల్‌లోని 16 కేంద్రాలలో 6,763 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారని వరంగల్‌ అర్బన్‌ జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు వెల్లడించారు. ఉదయం 9.30 గంటల నుంచి 11.30 వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 4.30 వరకు రెండు సెషన్లలో పరీక్ష జరుగనుంది. పరీక్షా కేంద్రాల నిర్వహణ కోసం హైదరాబాద్‌లో వెన్యూ సూపర్‌ వైజర్లతో పాటు 99 లోకల్‌ ఇన్‌స్పెక్షన్‌ అధికారులు, 34 మంది రూట్‌ ఆఫీసర్లను నియమించారు.

ఈ పరీక్షకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుంచి 30,199మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. విశాఖ, విజయవాడ, తిరుపతి,అనంతపురం నగరాల్లోని 68 కేంద్రాల్లో పరీక్షలు జరగనున్నాయి.

అభ్యర్థులు పరీక్ష ప్రారంభానికి గంట ముందు  కేంద్రాలకు చేరుకోవాలని ప్రభుత్వం సూచించింది. పరీక్ష ప్రారంభానికి 10 నిమిషాల ముందు గేట్లను మూసేస్తారని, ఆ తర్వాత అభ్యర్థులను లోనికి అనుమతించరని ప్రభుత్వం స్పష్టం చేసింది. కరోనా నేపథ్యం లో అభ్యర్థులంతా విధిగా మాస్క్‌/ఫేస్‌ కవర్‌ ధరించాలని సూచించింది.

మాస్కులు ఉంటేనే అభ్యర్థులను పరీక్షకు అనుమతిస్తారు.
అడ్మిట్‌ కార్డుతోపాటు గుర్తింపు కార్డు తప్పని సరి.
ఎలక్ట్రానిక్‌ పరికరాలు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించరు.
పర్సులు, వాచ్, మొబైల్‌ ఫోన్స్, పెన్‌డ్రైవ్, కాలుక్యులేటర్లు, ఇతర రికార్డింగ్‌ పరికరాలు అనుమతించరు.
హాల్‌టికెట్‌లో సూచించిన పరీక్షా కేంద్రాల్లో మాత్రమే పరీక్షకు అనుమతి.


Previous
Next Post »
0 Komentar

Google Tags