Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Corona Vaccine Ready By December, Says Serum Institute CEO Adar Poonawalla

 


Corona Vaccine Ready By December, Says Serum Institute CEO Adar Poonawalla

భారత్‌లో డిసెంబర్‌లో ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్.. రిజిస్టర్ చేసుకున్న వారికే ఫస్ట్

Oxford Vaccine: దేశ ప్రజలకు సీరమ్ ఇనిస్టిట్యూట్ శుభవార్త అందించింది. డిసెంబర్ నాటికి కరోనా వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉందని తెలిపింది. ఎమర్జెన్సీ అవసరాలు ఉన్నవారికి, ముందుగా రిజిస్టర్ చేసుకున్న వారికే తొలుత టీకా వేస్తామని తెలిపింది. 

కరోనా వ్యాక్సిన్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేళ పుణేకు చెందిన సీరమ్ ఇనిస్టిట్యూట్ తీపి కబురు అందించింది. దేశంలో డిసెంబర్‌ నాటికి ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ అందుబాటులోకి రావొచ్చని తెలిపింది. అయితే.. అత్యవసరం ఉన్న వారికే తొలుత టీకాను అందిస్తామని సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SSI) సీఈఓ అదార్ పూనవల్లా తెలిపారు. 

క్లినికల్‌ ట్రయల్స్‌ డిసెంబర్‌లో పూర్తయి వచ్చే ఏడాది జనవరిలో వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నట్లు అదార్ పూనవల్లా పేర్కొన్నారు. అయితే.. బ్రిటన్‌లో ఈ వ్యాక్సిన్ వినియోగానికి సంబంధించిన సమాచారం, డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (DCGI) నిర్ణయంపై ఇది ఆధారపడి ఉంటుందని ఆయన వివరించారు. 

బ్రిటన్‌లో నవంబర్ నుంచి కరోనా వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకురావాలని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ బృందం భావిస్తోంది. ఆ దిశగా ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. కరోనా ఫ్రంట్‌లైన్ వారియర్స్ వైద్యులు, వైద్య సిబ్బందికే తొలి టీకా ఇవ్వనున్నారు. 

బ్రిటన్‌లో అంతా సవ్యంగా జరిగితే దేశంలో డిసెంబర్‌ నాటికి వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుంది. తొలుత 10 కోట్ల డోసుల వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.’ అని అదార్ పూనవల్లా అన్నారు. 

కొవిషీల్డ్‌ (Covishield-20) రెండు డోసుల టీకా అని వైద్యులు తెలిపారు. ఒక డోసు వ్యాక్సిన్ వేసిన 28 రోజుల తర్వాత మరో డోసు టీకా వేయాల్సి ఉంటుంది. రెండు డోసుల టీకా వ్యయంపై ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నామని.. దీనిపై ఇప్పుడే మాట్లాడలేనని అదార్ పూనవల్లా తెలిపారు. అయితే.. మిగతా వ్యాక్సిన్‌ల కంటే చౌక ధరలోనే కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని స్పష్టం చేశారు. 

బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ, ఆ దేశంలోని ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకాతో కలిసి కరోనా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తోంది. ఈ వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేసి సరఫరా చేయడానికి సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ మూడో దశ పరీక్షలు దేశంలోనూ జరుగుతున్నాయి. సుమారు 1600 మంది వాలంటీర్లపై క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహిస్తున్నారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags