Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

CTET & TET 2020: NCTE extends Teacher Eligibility Test certificate validity for lifetime

 


CTET & TET 2020: NCTE Extends Teacher Eligibility Test Certificate Validity for Lifetime

టీచర్‌ వృత్తి స్వీకరించే వారికి గుడ్‌న్యూస్‌.. NCTE కీలక నిర్ణయం.. టెట్‌, సీటెట్‌ స్కోర్‌కు లైఫ్‌ టైమ్‌ వ్యాలిడిటీ..!

నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ (NCTE).. టెట్‌, సీటెట్‌ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.

సబ్జెక్ట్‌‌:

తాజాగా నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ (NCTE).. టెట్‌, సీటెట్‌ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు టెట్‌, సీటెట్‌ స్కోర్‌కు ఏడేళ్లపాటు వ్యాలిడిటీ ఉంది. అంటే.. ఒకసారి టెట్‌లోగానీ, సీటెట్‌లో గాని అర్హత సాధిస్తే ఆ స్కోర్‌ 7 ఏళ్లు చెల్లుబాటవుతుంది. అప్పటి వరకు రాష్ట్ర, నేషనల్‌ స్థాయిలో పడే టీచర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏడేళ్ల తరువాత ఆ స్కోర్‌ చెల్లుబాటు కాదు. 

లైఫ్‌ టైమ్ ప్రతిపాదన: ‌

అయితే తాజాగా ఎన్‌సీటీఈ ఈ విధానాన్ని మార్చి.. లైఫ్‌ టైమ్‌ (జీవిత కాలం) వ్యాలిడిటీ ఉండేలా ప్రతిపాదన తీసుకొచ్చింది. అంటే ఒక సారి టెట్‌, సీటెట్‌ లోగాని అర్హత సాధిస్తే.. ఆ స్కోర్‌ జీవిత కాలం చెల్లుబాటయ్యేలా మార్చాలనే ప్రతిపాదన చేస్తోంది. దీనివల్ల నిరుద్యోగులకు ఎంతో మేలు చేసినవాళ్లం అవుతామనే వాదన వినిపిస్తోంది. అయితే ఇప్పటికిది ప్రతిపాదన మాత్రమే. దీనిపై రాష్ట్ర ప్రభుత్వాలు, సీబీఎస్‌ఈ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. 

నేపథ్యం:

టెట్ లేదా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ లేదా ఉపాధ్యాయ అర్హత పరీక్ష. మన దేశంలో ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించాలి అనుకునే అభ్యర్థులకు నిర్వహించే అర్హత పరీక్ష. ఇందులో 1 నుండి 5 తరగతుల వరకు బోధించే ఉపాధ్యాయుల (ఎస్‌జీటీ) కు పేపర్-1 పరీక్ష ఉంటుంది. అలాగే 6వ తరగతి నుండి 10 తరగతి బోధించే ఉపాధ్యాయుల (స్కూల్‌ అసిస్టెంట్‌)కు పేపర్-2 పరీక్షలు ఉంటాయి. 

కేంద్రప్రభుత్వ నియమనిబంధనల ప్రకారం టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) ను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తాయి. టీచర్‌గా స్థిరపడాలంటే.. ఈ పరిక్షలో అర్హత సాధించడం తప్పనిసరి. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే డీఎస్సీ పరీక్షలో కూడా టెట్‌కు వెయిటేజీ ఇస్తారు. 

2011లో ప్రారంభం:

బోధనలో ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ను 2011 లో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టింది. డీఈడీ, బీఈడీ పూర్తిచేసిన వాళ్లు ఈ పరీక్ష రాయడానికి అర్హులు. ఈ పరీక్షలో 60% కంటే ఎక్కువ మార్కులు సాధించిన వారే డీఎస్సీ రాయడానికి అర్హులు. ఈ పరీక్ష సంవత్సరానికి రెండు సార్లు జరుగుతుంది. 

తెలుగు రాష్ట్రాల్లో:

జిల్లా ఎంపిక కమిటీ (డీఎస్సీ) ఆధ్వర్యంలో ఈ పరీక్షలు నిర్వహిస్తారు. డీఎస్సీలో టెట్‌కు 20 శాతం వెయిటేజి ఉంటుంది. టెట్‌లో పేపర్‌-1, పేపర్‌-2 ఉంటాయి. 1 నుంచి 5వ తరగతి వరకు బోధించేవారు (ఎస్‌జీటీ) పేపర్‌-1 పరీక్ష రాయాలి. 6 నుంచి 8వ తరగతి వరకు బోధించేవారు (స్కూల్‌ అసిస్టెంట్‌) పేపర్‌-2 పరీక్ష రాయాలి. 

మల్టిపుల్‌ ఛాయిస్‌ విధానంలో ఈ పరీక్ష ఉంటుంది. ప్రతి పేపర్‌లో 150 ప్రశ్నలు, 150 మార్కులు ఉంటాయి. జనరల్‌ అభ్యర్థులు 90 మార్కులు, బీసీ అభ్యర్థులు75 మార్కులు, ఎస్సీ/ఎస్టీ/ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ / దివ్యాంగులు 60 మార్కులు క్వాలిఫైయింగ్‌ మార్కులుగా సాధించాలి. టెట్‌ స్కోర్‌ ఏడేళ్ల పాటు చెల్లుబాటవుతుంది. 

కేంద్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష:

సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్టు (సీటెట్). దీన్ని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) ఏటా రెండుసార్లు నిర్వహిస్తోంది.1వ తరగతి నుండి ఎనిమిదో తరగతి వరకు బోధించడానికి ఈ అర్హత పరీక్ష రాయాలి. ఈ పరీక్ష ఉత్తీర్ణత సాధించిన వారు కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాలు, ఆర్మీ స్కూళ్లతో పాటు రాష్ట్రస్థాయి స్కూళ్లలో టీచర్ ఉద్యోగాల దరఖాస్తుకు అవసరమైన అర్హత లభిస్తుంది. 

ఈ పరీక్ష కూడా రెండు పేపర్లుగా నిర్వహిస్తారు. 1వ నుంచి 5వ తరగతుల బోధనకు సంబంధించి పేపర్ 1 నిర్వహిస్తారు. 6-8 తరగతుల బోధనకు సంబంధించి పేపర్ 2 నిర్వహిస్తారు. సీటెట్‌లో కనీసం 60 శాతం మార్కులు సాధించిన వారిని ఉత్తీర్ణులుగా ప్రకటిస్తారు. ఉత్తీర్ణులకు ఏడేళ్ల గుర్తింపుతో సర్టిఫికెట్ జారీ చేస్తారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags