Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

New Courses Sanctioned For Private Polytechnic Colleges in AP

 

New Courses Sanctioned For Private Polytechnic Colleges in AP

ఏపీ: పాలిటెక్నిక్‌ కాలేజీల్లో  కొత్తగా 5 కోర్సులు

పాలిటెక్నిక్ కాలేజీల్లో కొత్తగా ఐదు డిప్లొమా కోర్సులను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం అనుమతించింది. 

పాలిటెక్నిక్‌ చేరాలనుకునే విద్యార్థులకు విద్యార్ధులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. రాష్ట్రంలోని పలు ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీల్లో కొత్తగా ఐదు డిప్లొమా కోర్సులను ప్రవేశపెట్టేందుకు అనుమతించింది. వెబ్ డిజైనింగ్, 3-డీ యానిమేషన్ గ్రాఫిక్స్, యానిమేషన్-మల్టీమీడియా టెక్నాలజీ, ప్యాకేజింగ్ టెక్నాలజీ, సీఎస్సీ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) డిప్లొమా కోర్సులను ఈ విద్యా సంవత్సరం (2020-21) నుంచి విద్యార్ధులకు అందుబాటులోకి తీసుకొస్తూ రాష్ట్ర నైపుణ్యాభివృద్ది, శిక్షణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 

ఈ కోర్సుల్లో ప్రవేశం పొందే అభ్యర్థులు ఎస్‌ఎస్‌సీ లేదా తత్సమాన పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉండాలి. ఈ కోర్సుల వ్యవధి మూడేళ్గుగా నిర్ణయించారు. కాగా, SBTET నిబంధనల ప్రకారం పాలీసెట్ ద్వారా ప్రవేశాలను నిర్వహించనున్నారు. 

కొత్త కోర్సుల వివరాలు:

గుంటూరు జిల్లా చెబ్రోలు మండలంలోని సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ 3-డీ యానిమేషన్ గ్రాఫిక్స్, యానిమేషన్- మల్టీమీడియా టెక్నాలజీ, వెబ్ డిజైనింగ్‌లో డిప్లొమా కోర్సులను ప్రవేశపెట్టడానికి అనుమతించింది.

తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం కిమ్స్ కాలేజీలో ప్యాకేజింగ్ టెక్నాలజీలో డిప్లొమా కోర్సును ప్రవేశపెట్టేందుకు అనుమతి ఇచ్చింది.

కోరంగిలోని కిమ్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ విమెన్‌లో 3-డీ యానిమేషన్ గ్రాఫిక్స్ డిప్లొమా కోర్సును అనుమతించింది.

రాజానగరంలోని ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ ఫర్ విమెన్‌లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)లో డిప్లొమా కోర్సును మంజూరు చేసింది.]



Previous
Next Post »
0 Komentar

Google Tags