Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Staff Selection Commission – Junior Engineer Job Notification


Staff Selection Commission – Junior Engineer Job Notification
ఇంజనీరింగ్‌, డిప్లొమా వాళ్లకు సూపర్‌ ఛాన్స్‌.. జేఈ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల

జూనియ‌ర్ ఇంజినీర్ పోస్టుల భ‌ర్తీకి స్టాఫ్ సెల‌క్ష‌న్ క‌మిష‌న్ (ఎస్ఎస్‌సీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 
దేశవ్యాప్తంగా వివిధ‌ కేంద్ర మంత్రిత్వ శాఖ‌లు/ విభాగాలు/ సంస్థ‌ల్లో జూనియ‌ర్ ఇంజినీర్ పోస్టుల భ‌ర్తీకి స్టాఫ్ సెల‌క్ష‌న్ క‌మిష‌న్ (ఎస్ఎస్‌సీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తులు అక్టోబ‌ర్ 30 వ‌ర‌కు అందుబాటులో ఉంటాయ‌ని తెలిపింది. కాగా, ఎన్ని పోస్టులు భ‌ర్తీ చేస్తున్న‌ద‌నే విష‌యాన్ని ప్ర‌క‌టించ‌లేదు. ప‌రీక్ష స‌మ‌యానికి పోస్టుల సంఖ్య‌ను క‌మిష‌న్ వెబ్‌సైట్‌లో ప్ర‌క‌టిస్తామ‌ని వెల్ల‌డించింది.

ఉద్యోగ సంస్థ‌లు:
ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులు.. సెంట్ర‌ల్ వాట‌ర్ క‌మిష‌న్‌, సెంట్ర‌ల్ ప‌బ్లిక్ వ‌ర్క్స్ డిపార్ట్‌మెంట్, మిల‌ట‌రీ ఇంజినీర్ స‌ర్వీస్‌, ఫ‌ర‌క్కా బ్యారేజ్ ప్రాజెక్టు, బోర్డ‌ర్ రోడ్ ఆర్గ‌నైజేష‌న్, సెంట్రల్ వాట‌ర్ అండ్ ప‌వ‌ర్ రిసెర్చ్ స్టేష‌న్‌, డైరెక్ట‌రేట్ ఆఫ్ క్వాలిటీ అస్యూర‌న్స్ (నావ‌ల్‌), నేష‌న‌ల్ టెక్నిక‌ల్ రిసెర్చ్ ఆర్గ‌నైజేష‌న్ తదితర సంస్థల్లో ఉన్నాయి.

గమనిక: బార్డ‌ర్ రోడ్ ఆర్గ‌నైజేష‌న్‌లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల‌కు పురుష అభ్య‌ర్థులు మాత్ర‌మే ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

ముఖ్య సమాచారం:
పోస్టు పేరు: జూనియ‌ర్ ఇంజినీర్‌
ఖాళీలు: త‌ర్వాత వెల్ల‌డిస్తారు.
అర్హ‌త‌: సంబంధిత బ్రాంచుల్లో ఇంజినీరింగ్ డిగ్రీ/ డిప్లొమాతో పాటు నిర్దిష్ట అనుభ‌వం ఉండాలి.
గ‌రిష్ఠ వ‌యఃప‌రిమితి: జనవరి 01, 2021 నాటికి వాట‌ర్ క‌మిష‌న్‌, ప‌బ్లిక్ వ‌ర్క్స్ పోస్టుల‌కు 32 ఏళ్లు; మిగిలిన‌వాటికి 30 ఏళ్లు మించకూడదు.
ఎంపిక‌: క‌ంప్యూట‌ర్ బేస్డ్‌ రాత‌ప‌రీక్ష, డిస్క్రిప్టివ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ప‌రీక్ష తేది: పేప‌ర్‌-1 2021 మార్చి 22 నుంచి 25 వ‌ర‌కు. పేప‌ర్‌-2 (క‌న్వెన్ష‌న‌ల్‌) పరీక్ష తేదీ త‌ర్వాత వెల్ల‌డిస్తారు.
ప‌రీక్షా కేంద్రాలు: స‌ద‌ర‌న్ రీజియ‌న్ (ఏపీ, తెలంగాణ‌, త‌మిళ‌నాడు, పుదుచ్చేరి)లో చీరాల‌, గుంటూరు, కాకినాడ‌, క‌ర్నూలు, నెల్లూరు, రాజ‌మండ్రి, తిరుప‌తి, విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్నం, విజ‌య‌న‌గ‌రం, పుదుచ్చేరి, చెన్నై, కోయంబ‌త్తూరు, మ‌దురై, సేలం, తిరుచిరాప‌ల్లి, తిరున‌ల్వేలి, వెల్లూరు, హైద‌రాబాద్‌, క‌రీంన‌గ‌ర్‌, వ‌రంగ‌ల్‌.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ.100
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: అక్టోబర్‌ 30, 2020.
ఫీజు చెల్లించ‌డానికి చివ‌రితేది: నవంబర్‌ 01, 2020.
వెబ్‌సైట్‌: https://ssc.nic.in/
Previous
Next Post »
0 Komentar

Google Tags