Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

The Central Govt Alerts for Best Steps To Make Covid Vaccine Accessible To All


The Central Govt Alerts for Best Steps To Make Covid Vaccine Accessible To All
అందరికీ అందుబాటులోకి కరోనా వ్యాక్సిన్ తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు

దేశీయ అవసరాలకు సరిపడా కరోనా వ్యాక్సిన్ డోసులను అందుబాటులోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టింది. ఔషధ ఉత్పత్తి సంస్థలకు తగిన ఆదేశాలు జారీ చేసింది.

ప్రపంచాన్ని వణికిస్తున్న కొవిడ్-19 మహమ్మారికి వ్యాక్సిన్ అభివృద్ధి ప్రక్రియ తుది దశకు చేరుకున్న వేళ కేంద్ర ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. కోట్లాది మందికి వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసురావడానికి అవసరమైన చర్యలపై దృష్టి సారించింది. అవసరమైతే నిత్యావసరాల చట్టం (Essential Commodities Act), డ్రగ్స్ అండ్ కాస్మోటిక్స్ యాక్ట్ (Drugs and Cosmetics Act), విపత్తు నిర్వహణ చట్టం (Disaster Management Act) ఆధారంగా దేశ ప్రజలకు సత్వరంగా వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకురావడానికి తగిన చర్యలు తీసుకోవడానికి సిద్ధమైంది. అధికారులను, ప్రభుత్వ యంత్రాంగాన్ని తదనుగుణంగా సన్నద్ధం చేసింది. ఔషధ ఉత్పత్తి సంస్థలకు తగిన ఆదేశాలు జారీ చేసింది.

ప్రజలకు అవసరమైన వ్యాక్సిన్ నిల్వలను పెద్ద ఎత్తున అందుబాటులో ఉంచడంతో పాటు.. ధరలను కూడా అందుబాటులో ఉండేలా చూడటానికి కేంద్రం చర్యలు చేపట్టింది. ఉదాహరణకు.. నిత్యావసరాల చట్టం ప్రకారం.. డ్రగ్స్ ఉత్పత్తి, సరఫరా, పంపిణీ తదితర అంశాలను నియంత్రించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంది. ఈ చట్టం ప్రకారం ఉత్పత్తి సంస్థకు చెందిన పూర్తి నిల్వలు లేదా కొంత మొత్తం నిల్వలను కచ్చితంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకే విక్రయించాలనే నిబంధన విధించే అధికారం ఉంది. దీంతో పాటు ఆరోగ్య అత్యయిక స్థితిని విధించి (Pubic Health Emergency) టీకా ధరలను నియంత్రించే సంపూర్ణ అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంది.

దేశీయ అవసరాలకు సరిపడిన తర్వాతే..
దేశీయ అవసరాలకు సరిపడా వ్యాక్సిన్ నిల్వలు అందుబాటులో ఉంచిన తర్వాతే విదేశాలకు ఎగుమతి చేయడానికి అవకాశం కల్పిస్తామని ప్రధాని నరేంద్రం మోదీ ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. కరోనాకు ముందుగా ఏ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా.. ఆ టీకాను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి ఫార్మా కంపెనీలను ఇప్పటికే సమాయత్తం చేశారు. ఔషధ ఉత్పత్తి సంస్థలు భారీ సంఖ్యలో ఉండటం భారత్‌కు కలిసొచ్చే అంశం.

ప్రపంచం మొత్తానికి సరఫరా చేసే సామర్థ్యం మన సొంతం
ప్రపంచ అవసరాలకు సరిపడా వ్యాక్సిన్లను ఉత్పత్తి చేయగలిగే సామర్థ్యం మన సంస్థలకు ఉంది. 2021 చివరి వరకు ప్రపంచవ్యాప్తంగా 2 నుంచి 4 బిలియన్ల కొవిడ్ వ్యాక్సిన్ డోసులు అందుబాటులోకి వస్తాయని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. వీటిలో భారత్ వాటానే ప్రధానంగా ఉంటుందని చెబుతున్నారు. ప్రపంచంలో అతిపెద్ద డ్రగ్స్ ఉత్పత్తి సంస్థగా గుర్తింపు పొందిన పుణేలోని సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (Serum Institute of India - SII) ఒక్కటే 400 నుంచి 500 మిలియన్ డోసుల టీకాలను ఉత్పత్తి చేయగలదని వివరిస్తున్నారు. నెలకు 200 మిలియన్ డోసుల టీకాలను ఉత్పత్తి చేయగలిగే సామర్థ్యం భారత్‌కు ఉందని విశ్లేషిస్తున్నారు.
Previous
Next Post »
0 Komentar

Google Tags