Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS: EAMCET‌-2020 Results Released and Check Counselling Schedule



TS: EAMCET‌-2020 Results Released
 తెలంగాణ ఎంసెట్-2020‌ ఫలితాలు విడుదల
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఎంసెట్-2020 పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు హైదరాబాద్ లోని కూకట్ పల్లి జేఎన్టీయూహెచ్ లో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలు విడుదల చేశారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండు సెషన్లలో ఈ పరీక్షలు నిర్వహించారు. మొత్తం నాలుగు రోజులపాటు ఆన్లైన్ ద్వారా అధికారులు ఈ పరీక్షలు నిర్వహించారు. ఇందుకోసం మొత్తం 102 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా.. అందులో 79 తెలంగాణలో, 23 పరీక్షా కేంద్రాలు ఏపీలో ఉన్నాయి.
ఎంసెట్ ఇంజినీరింగ్ లో 75.29 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి వివరించారు. మొత్తంగా పరీక్షకు 1,19,183 మంది విద్యార్థులు హాజరుకాగా వారిలో 89,734 మంది ఉత్తీర్ణులైనట్లు మంత్రి వెల్లడించారు. కరోనా వల్ల హాజరుకాని విద్యార్థులకు ఈ నెల 8వ తేదీన పరీక్ష నిర్వహించనున్నట్లు చెప్పారు.

మొదటి ర్యాంకు: సాయితేజ
రెండో ర్యాంకు: యశ్వంత్ సాయి
మూడో ర్యాంకు: తమ్మని మణివెంకట కృష్ణ

అభ్యర్థులు ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌ https://eamcet.tsche.ac.in/ లో చూసుకోవచ్చని తెలిపిన ఆయన.. ఎంసెట్ రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్ సబ్‌మిట్ చేసి ఫలితాలు చూసుకోవచ్చన్నారు.
  
కరోనా కారణంగా ఈ ఏడాది ఎంసెట్‌ నిర్వహణ ఆలస్యమైంది. సెప్టెంబర్‌లో నాలుగు రోజుల పాటు రెండు సెషన్లలో పరీక్షను నిర్వహించారు. 1లక్ష43 వేల165 మంది ప‌రీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. 

ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌:

ఈ నెల 9వ తేదీ నుంచి 17 వరకు ఆన్‌లైన్‌లో స్లాట్ల నమోదు చేసుకోవచ్చు. 
ఈ నెల 12 నుంచి 18 వరకు అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలించనున్నారు. 
ఈ నెల 12 నుంచి 20 వరకు ఎంసెట్‌ వెబ్‌ ఆప్షన్లు పెట్టుకునే అవకాశం ఉంది. 
ఈ నెల 22న మొదటి విడత ఇంజినీరింగ్‌ సీట్లను కేటాయించనున్నారు. 
ఈ నెల 29 నుంచి ఎంసెట్‌ తుది విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ జరుగనుంది. 
30న తుది విడత ధ్రువపత్రాల పరిశీలిస్తారు. 
30, 31 తేదీల్లో తుది విడుత ఎంసెట్‌ వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. 
నవంబర్‌ 2న ఇంజినీరింగ్‌ తుది విడుత సీట్ల కేటాయించనున్నారు. 
నవంబర్‌ 4న స్పాట్‌ అడ్మిషన్ల మార్గదర్శకాలను అధికారులు విడుదల చేయనున్నారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags