Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP ECET-2020 Counselling Completed

 


AP ECET-2020 Counselling Completed

ఏ‌పి ఈసెట్‌లో 27శాతం సీట్ల భర్తీ -  ముగిసిన కౌన్సెలింగ్‌

ఇంజినీరింగ్‌, ఫార్మసీ కోర్సుల్లో రెండో ఏడాది ప్రవేశాలకు నిర్వహించే ఈసెట్‌ కౌన్సెలింగ్‌లో 27.23శాతం సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఈసెట్‌ కన్వీనర్‌ ఎం.ఎం.నాయక్ న‌వంబ‌రు 13న‌ ఆన్‌లైన్‌లో సీట్లు కేటాయించారు. కన్వీనర్‌ కోటాలో ఇంజినీరింగ్‌, ఫార్మసీలో కలిపి 57,888 సీట్లు ఉండగా 15,763 భర్తీ అయ్యాయి. ఈసెట్‌లో మొత్తం 30,662 మంది అర్హత సాధించగా 19,055 మంది కౌన్సెలింగ్‌కు నమోదు చేసుకున్నారు. 17,618మంది కళాశాలలు, కోర్సులకు ఐచ్ఛికాలు ఇచ్చారు. క్రీడల కోటా 262, ఎన్‌సీసీ కోటా 524 సీట్ల కేటాయింపును పెండింగ్‌లో పెట్టారు. క్రీడా ప్రాధికార సంస్థ(శాప్‌), ఎన్‌సీసీ నుంచి ధ్రువపత్రాల పరిశీలనపై సమాచారం రాకపోవడంతో సీట్ల కేటాయింపు నిలిపివేశారు.

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags