Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

FM Announces Atma Nirbhar Bharat Rozgar Yojana to Incentivise Job Creation

 


FM Announces Atma Nirbhar Bharat Rozgar Yojana to Incentivise Job Creation

నిర్మలా సీతారామన్ గుడ్ న్యూస్.. కొత్త స్కీమ్ ప్రకటన.. వారందరికీ బెనిఫిట్!

కేంద్ర ప్రభుత్వం దేశంలో ఉపాధి పెంపు లక్ష్యంగా కీలక నిర్ణయం తీసుకుంది. ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గర్ యోజన స్కీమ్‌‌ను ప్రకటించింది. దీని ద్వారా ఉపాధి పెరుగుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. 

రోజ్‌గర్ యోజన స్కీమ్ ప్రకటన

ఉపాధి పెంపు లక్ష్యం

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ఉపాధి కల్పనను పెంచాలనే లక్ష్యంతో కొత్త స్కీమ్‌‌ను తీసుకువచ్చింది. దీని పేరు ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గర్ యోజన. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఆత్మనిర్భర్ 3.0లో భాగంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ స్కీమ్‌ను ప్రకటించారు. 

ఆత్మ నిర్భర్ భారత్ రోజ్‌గర్ యోజన స్కీమ్ ద్వారా దేశంలో ఉపాధి కల్పన పెరుగుతుందని నిర్మలా సీతారామన్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈపీఎఫ్‌వో‌లో రిజిస్టర్ అయిన ప్రతి సంస్థకు ఈ స్కీమ్ వర్తిస్తుంది. కంపెనీలు కొత్తగా ఉద్యోగులను నియమించుకున్నా (2021 జూన్ 30 వరకు) లేదంటే మార్చి 1 నుంచి సెప్టెంబర్ 30 మధ్యలో ఉపాధి కోల్పోయిన వారు ఈ పథకం ద్వారా బెనిఫిట్ పొందొచ్చు. 

ఈ స్కీమ్‌లో భాగంగా 1000కి లోపు ఉద్యోగులు ఉన్న కంపెనీలు కొత్తగా ఉద్యోగులను చేర్చుకుంటే అప్పుడు వారి పీఎఫ్ కంట్రిబ్యూషన్‌ను, కంపెనీ పీఎఫ్ కంట్రిబ్యూషన్‌ను మొత్తంగా 24 శాతం కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. అదేసమయంలో 1000కి పైన ఉద్యోగులు ఉన్న కంపెనీలు కొత్త వారికి నియమించుకుంటే అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగి కంట్రిబ్యూషన్‌ను చెల్లిస్తుంది. ఇక్కడ ఉద్యోగి వేతనం రూ.15,000లోపు ఉంటేనే ఇది వర్తిస్తుంది. 

ఈ కొత్త స్కీమ్ 2020 అక్టోబర్ 1 నుంచే అమలులోకి వస్తుందని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. వచ్చే రెండేళ్ల కాలం పాటు ఈ స్కీమ్ అమలులో ఉంటుంది. ఇకపోతే 11 రాష్ట్రాలు వడ్డీ రహిత రుణాల కింద రూ.3,621 కోట్ల నిధులు పొందాలయని ఆమె తెలిపారు. అలాగే పన్ను చెల్లింపుదారులకు 1.32 లక్షల కోట్ల రిఫండ్స్ ఇచ్చామని పేర్కొన్నారు. 

అలాగే ఎమర్జెన్సీ క్రెడిట్ లిక్విడిటీ గ్యారంటీ స్కీమ్ కింద 61 లక్షల మంది రుణ గ్రహీతలకు రూ.2.05 లక్షల కోట్లు మంజూరు చేశామని నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇంకా 2.5 కోట్ల మంది రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులు అందించామని పేర్కొన్నారు. ప్రధాన్ మంత్రి మత్స్య సంపద యోజన ద్వారా రాష్ట్రాలకు రూ.1,700 కోట్లు విడుదల చేశామని తెలిపారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags