Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

రేపే ఏపీ సెట్ – 2020 - 35,862 మంది దరఖాస్తు - 30 సబ్జెక్టులలో పరీక్ష

 

రేపే ఏపీ సెట్ – 2020 -  35,862 మంది దరఖాస్తు

రాష్ట్ర స్థాయిలో యూనివర్సిటీలు, ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో -అసిస్టెంట్ ప్రొఫెసర్లు, లెక్చరర్ల పోస్టులకు అర్హత పరీక్ష ఏపీసెట్-2020 ఆదివారం నిర్వ హించనున్నారు. దీనికి సంబంధించి ఏపీ సెట్ -మెంబర్ సెక్రటరీ ఆచార్య కె.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏపీ సెట్ కు 35,862 మంది దరఖాస్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా విశాఖపట్నం, రాజమండ్రి, గుంటూరు, నెల్లూరు, అనంతపురం, తిరుపతి, కడప, కర్నూలు నగరాల్లో 76 -పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. 30 సబ్జెక్టులలో పరీక్ష జరుగుతుంది. నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించరు. వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకుని పరీక్షకు నేరుగా హాజరు కావచ్చు. ఆదివారం ఉదయం 9.30 నుంచి 12.30 వరకు జరిగే ఈ పరీక్షకు గంట ముందుగా కేంద్రాలలోకి అనుమతిస్తారు. 

DOWNLOAD HALL TICKETS

WEBSITE

IMPORTANT DATES 

Previous
Next Post »
0 Komentar

Google Tags