Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

OU - JNTU Postpones Semester Exams Scheduled on December 8

 

OU - JNTU Postpones Semester Exams Scheduled on December 8

భారత్ బంద్ కారణంగా వాయిదా పడిన పరీక్షలు.. వివరాలు ఇవే..!

భారత్‌ బంద్‌ కారణంగా వర్సిటీలు పలు పరీక్షలు వాయిదా వేస్తున్నాయి.

రేపు (డిసెంబర్ 8) దేశవ్యాప్తంగా భారత్ బంద్‌కు రైతు సంఘాలు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం సైతం ఈ బంద్‌కు సంపూర్ణ మద్ధతు ఇచ్చిన విషయం కూడా విధితమే. ఈ నేపథ్యంలో డిసెంబర్‌ 8 పలు పరీక్షలు ఉండటంతో విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. దీంతో ఆయా వర్సిటీలు పలు పరీక్షలు వాయిదా వేస్తున్నాయి. 

రైతు సంఘాలు డిసెంబర్ 8న ప్రకటించిన భారత్ బంద్‌కు తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. భారత్ బంద్‌కు మద్దతు పెరుగుతుండటంతో ఉస్మానియా యూనివర్సిటీ, జేఎన్‌టీయూ పరీక్షల్ని వాయిదా వేశాయి. 

డిసెంబర్ 8న ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో నిర్వహిస్తున్న అన్ని పరీక్షల్ని వాయిదా వేస్తున్నట్టు ఓయూ ప్రకటించింది. డిసెంబర్ 9 నుంచి జరగాల్సిన పరీక్షలు యథావిథిగా జరుగుతాయని ప్రకటించింది. అలాగే.. జేఎన్‌టీయూ సైతం రేపు జరగాల్సిన పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. వాయిదా పడిన పరీక్షలను డిసెంబర్‌ 10వ తేదీ నిర్వహించనున్నట్లు పేర్కొంది. 

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ రైతుల ఆందోళన కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఢిల్లీలో రైతులు నిర్వహిస్తున్న ఆందోళనలకు అనేక వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. 

కేంద్ర ప్రభుత్వంతో జరిగిన చర్చలు విఫలం కావడంతో రైతు సంఘాలు డిసెంబర్ 8న భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. మంగళవారం జరగబోయే దేశవ్యాప్త బంద్‌కు అనేక వర్గాలు, రాజకీయ పార్టీల నుంచి మద్దతు లభిస్తోంది. తెలంగాణలో ప్రస్తుతం డిగ్రీ విద్యార్థులకు సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్నాయి. ఇంతలో బంద్ రావడంతో ఈ పరీక్షలు జరుగుతాయా లేదా అన్న ఆందోళన విద్యార్థుల్లో ఉంది. మంగళవారం జరగాల్సిన పరీక్షలు వాయిదా వేస్తున్నట్టు ఇప్పటికే ఉస్మానియా విశ్వవిద్యాలయం, జేఎన్‌టీయూ ప్రకటించాయి. బుధవారం నుంచి జరగాల్సిన పరీక్షలు యథాతథంగా జరుగుతాయి.

Previous
Next Post »
0 Komentar

Google Tags