Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

IB Recruitment 2020 Notification for ACIO Grade-II/ Executive

IB Recruitment 2020 Notification for ACIO Grade-II/ Executive

ఐబీలో 2000 ఏసీఐఓ పోస్టులు

భార‌త ప్ర‌భుత్వ హోం మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) జ‌న‌ర‌ల్ సెంట్ర‌ల్ స‌ర్వీస్ విభాగానికి చెందిన కింది గ్రూప్ సి (నాన్ గెజిటెడ్‌, నాన్ మినిస్టీరియ‌ల్‌) పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు..

అసిస్టెంట్ సెంట్ర‌ల్ ఇంటెలిజెన్స్ ఆఫీస‌ర్ (ఏసీఐఓ)-గ‌్రేడ్‌-2/ ఎగ్జిక్యూటివ్‌

మొత్తం ఖాళీలు: 2000

కేట‌గిరీల వారీగా ఖాళీలు: అన్‌రిజ‌ర్వ్‌డ్‌-989, ఈడ‌బ్ల్యూఎస్‌-113, ఓబీసీ-417, ఎస్సీ-360, ఎస్టీ-121.

అర్హ‌త‌: ఏదైనా గ్రాడ్యుయేష‌న్‌/ త‌త్స‌మాన ఉత్తీర్ణ‌త‌.

వ‌య‌సు: 18-27 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీల‌కు ఐదేళ్లు, ఓబీసీల‌కు మూడేళ్లు గ‌రిష్ఠ వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

ఎంపిక విధానం:  రాత ప‌రీక్ష‌(ఆన్‌లైన్‌), ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

ప‌రీక్షా విధానం:

టైయ‌ర్‌-1: ఆన్‌లైన్ ప‌ద్ధ‌తిలో టైర్‌-1 ప‌రీక్ష ఉటుంది. దీనిని 100 మార్కుల‌కు ఆబ్జెక్టివ్ ప‌ద్ధ‌తిలో నిర్వ‌హిస్తారు. దీన్ని 5 విభాగాలుగా విభ‌జించి విభాగానికి 20 ప్ర‌శ్న‌ల చొప్పున(ఒక్కో ప్ర‌శ్న‌కు ఒక్కో మార్కు) ఇస్తారు. ప‌రీక్షా స‌మ‌యం ఒక గంట‌. విభాగాలు కింది విధంగా..

1) జ‌న‌ర‌ల్ అవేర్‌నెస్‌

2) క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్‌

3) న్యూమ‌రిక‌ల్‌/ అన‌లైటిక‌ల్‌/ లాజిక‌ల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్‌

4) ఇంగ్లిష్ లాంగ్వేజ్‌

5) జ‌న‌ర‌ల్ స్ట‌డీస్

టైయ‌ర్‌-2: ఇది డిస్క్రిప్టివ్ ప‌ద్ధ‌తిలో ఉంటుంది. దీన్ని మొత్తం 50 మార్కుల‌కు నిర్వ‌హిస్తారు. ఇందులో 30 మార్కుల‌కు ఎస్సై రైటింగ్ ఉంటుంది. మిగిలిన 20 మార్కుల‌కు ఇంగ్లిష్ కాంప్ర‌హెన్ష‌న్ అండ్ ప్రేజెస్ రైటింగ్ ఉంటాయి. దీనికి ప‌రిక్షా స‌మ‌యం ఒక గంట‌గా కేట‌యించారు.

టైయ‌ర్‌-3: ఇందులో ఇంట‌ర్వ్యూ ఉంటుంది. దీన్ని మొత్తం 100 మార్కుల‌కు నిర్వ‌హిస్తారు.

దీనికి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్ర‌తి త‌ప్పు స‌మాధానానికి 1|4 మార్కులు క‌ట్ చేస్తారు.

తెలుగు రాష్ట్రాల్లో ప‌రీక్షా కేంద్రాలు:

తెలంగాణ‌: హైద‌రాబాద్‌, క‌రీంన‌గ‌ర్‌, వ‌రంగ‌ల్‌.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌: గుంటూరు, కాకినాడ‌, క‌ర్నూలు, నెల్లూరు, రాజ‌మండ్రి, తిరుప‌తి, విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్నం, విజ‌య‌న‌గ‌రం.

అభ్య‌ర్థులు గ‌రిష్ఠంగా మూడు ప‌రీక్షా కేంద్రాలు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.

ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 09.01.2021.

WEBSITE

NOTIFICATION

APPLICATION

Previous
Next Post »
0 Komentar

Google Tags