Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

టి‌ఎస్: పోలీసు, ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సీఎం ఆదేశం

 

టి‌ఎస్: పోలీసు, ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సీఎం ఆదేశం

రాష్ర్టంలో త్వ‌ర‌లోనే టీచ‌ర్లు, పోలీసు పోస్టుల ఖాళీల‌కు నోటిఫికేష‌న్ వెలువ‌డ‌నుంది. ఉపాధ్యాయ, పోలీసు పోస్టుల‌తో పాటు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తీ చేసేందుకు త్వరలోనే నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు సేకరించాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ను సీఎం ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖల్లో దాదాపు 50 వేల వరకు ఖాళీలున్నట్లు ప్రాథమిక సమాచారం. వాటన్నీంటినీ భర్తీ చేయాల‌న్నారు. ఈ రెండు విభాగాలతో పాటు రాష్ట్రంలోని ఇతర శాఖల్లో ఉన్న ఖాళీల వివరాలు వెంటనే సేకరించాలన్నారు. ఇంకా ఏ ఏ శాఖల్లో ఎంత మంది ఉద్యోగుల అవసరం ఉందో లెక్క తేల్చాలన్నారు. ఖాళీ పోస్టుల వివరాల సేకరణ అనంతరం నోటిఫికేషన్లు ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags