Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS: ఇంటర్‌ విద్యార్థులకు రోజు విడిచి రోజు బోధన - ఒకరోజు జూనియర్స్‌కు, మర్నాడు సీనియర్స్‌కు

 

TS: ఇంటర్‌ విద్యార్థులకు రోజు విడిచి రోజు బోధన - ఒకరోజు జూనియర్స్‌కు, మర్నాడు సీనియర్స్‌కు 

రాష్ట్రంలోని అన్ని రకాల ప్రభుత్వ, ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలలు ఇక ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పనిచేస్తాయి. అయితే, ఒక రోజు ప్రథమ ఇంటర్‌కు బోధిస్తే, మర్నాడు ద్వితీయ ఇంటర్‌ విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తారు. రెండు వారాల క్రితం నాటి  మార్గదర్శకాల్లో కొన్నింటిని మార్చుతూ ఇంటర్‌ విద్యాశాఖ కళాశాలలను తెరిచేందుకు తాజాగా నిబంధనలను జారీచేసింది.

300 మందిలోపు విద్యార్థులు, తగిన వసతులు ఉంటే ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నడుపుకోవచ్చు. అంతకంటే మించి ఉంటే రెండు షిఫ్టుల్లో ఉదయం 8.30 నుంచి 12.30 గంటల వరకు, తిరిగి 1.30 నుంచి 5.30 గంటల వరకు తరగతులు జరుపుకోవాలి. రెండో ఏడాది వారికి మొదటి షిఫ్టులో తరగతులు నిర్వహించాలి. తాజాగా ఆ నిబంధనలను ఇంటర్‌ విద్యాశాఖ మార్చింది. హాస్టళ్లు, తరగతి గదుల్లో భౌతిక దూరం పాటించటం తదితరాల బాధ్యత ఆయా యాజమాన్యాలదేనని స్పష్టం చేసింది. 

చదువుతున్న కళాశాలలోనే ఇంటర్‌ ప్రయోగ పరీక్షలు! 

ఇంటర్‌ ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు.. వారు చదువుతున్న కళాశాలలోనే ఈసారి ప్రయోగ పరీక్షలు నిర్వహించే అవకాశం ఇవ్వాలని ఇంటర్‌బోర్డు భావిస్తోంది. ఇప్పటివరకు ఒక కళాశాల విద్యార్థులకు మరో కళాశాలలో ప్రాక్టికల్స్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. కరోనా పరిస్థితుల్లో ఈసారి చదువుతున్న చోటే ఈ పరీక్షలు నిర్వహించేలా అనుమతి ఇవ్వాలని బోర్డు యోచిస్తోంది.

Previous
Next Post »
0 Komentar

Google Tags