Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

టి‌ఎస్: మార్చి 5 నుంచి ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ

 

టి‌ఎస్: మార్చి 5 నుంచి ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ

మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట మండలం హకీంపేటలోని స్పోర్ట్స్‌ స్కూల్‌లో మార్చి 5 నుంచి 24 వరకు ఆర్మీ ర్యాలీ నిర్వహించనున్నట్టు జిల్లా అదనపు కలెక్టర్‌ విద్యాసాగర్‌ వెల్లడించారు. ఈ మేరకు బుధవారం (ఫిబ్రవరి 18) ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీపై వివిధ శాఖల అధికారులతో హకీంపేటలోని స్పోర్ట్స్‌ స్కూల్‌లో జరిగిన సమీక్ష సమావేశంలో విద్యాసాగర్‌ మాట్లాడారు. రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి అభ్యర్థులు పాల్గొంటున్నారని, ఆ శాఖల ఆధ్వర్యంలో అన్ని సౌకర్యాలు కల్పించాలని సంబంఽధిత అధికారులను ఆదేశించారు. సుమారు  65 వేల దరఖాస్తులు రావొచ్చని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. ఈ ర్యాలీలో ప్రతిరోజూ 4 వేల మందికి మాత్రమే అనుమతి ఉంటుందని, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని వసతులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ర్యాలీకి సంబంధించి వాకింగ్‌ ట్రాక్‌, పరిసరాలు, అభ్యర్థులకు అవసరమైన సౌకర్యాలను పరిశీలించారు.

Refer for Notifications Details 

Previous
Next Post »
0 Komentar

Google Tags