Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP Covid-19 Media Bulletin 23-03-2021

 

AP Covid-19 Media Bulletin 23-03-2021

ఏపీలో భారీగా పెరుగుతున్న కరోనా పాజిటివ్‌ కేసులు

ఏపీలో భారీగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఇటీవల కాలంలో ఎన్నడూ లేనంతగా 24 గంటల వ్యవధిలో 492 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఒక్కరోజు వ్యవధిలో 33,634 నమూనాలను పరీక్షించగా తాజా కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో కొవిడ్‌ కేసుల సంఖ్య 8,94,536కి చేరింది. ఈ మేరకు వైద్యఆరోగ్యశాఖ బులెటిన్‌ విడుదల చేసింది. ఒక్క రోజు వ్యవధిలో కరోనా చికిత్స పొందుతూ చిత్తూరు, విశాఖపట్నం జిల్లాల్లో ఒకరు చొప్పున మరణించారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కొవిడ్‌తో మృతిచెందిన వారి సంఖ్య 7193కి చేరింది. 24 గంటల్లో 256 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకోగా, ప్రస్తుతం రాష్ట్రంలో 2616 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1,48,05,335 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది.


Previous
Next Post »
0 Komentar

Google Tags