Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP Covid-19 Media Bulletin 27-03-2021

 

AP Covid-19 Media Bulletin 27-03-2021

ఏపీలో కొత్తగా 947 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 42,696 కరోనా పరీక్షలు నిర్వహించగా, 947 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 8,97,810 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్‌ వల్ల ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 7,203గా ఉంది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. 

24 గంటల వ్యవధిలో 377 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 8,85,892కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,715 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,49,58,897 కరోనా నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది. అత్యధికంగా చిత్తూరులో 180, అత్యల్పంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 18 కేసులు నమోదయ్యాయి. నాలుగు జిల్లాల్లో వందకుపైగా కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.



Previous
Next Post »
0 Komentar

Google Tags