Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

రాష్ట్ర వ్యాప్తంగా పీహెచ్‌సీల పనివేళలు మార్పు

 

రాష్ట్ర వ్యాప్తంగా పీహెచ్‌సీల పనివేళలు మార్పు 

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్‌సీ) పనివేళలు మార్పు చేస్తూ ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ సంచాలకురాలు గీతాప్రసాదిని శుక్రవారం ఆదేశాలిచ్చారు.

మొదటి షిఫ్టు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు, రెండో షిఫ్టు మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 9 గంటల వరకు ఉంటుంది. రాత్రి 9 నుంచి మరుసటి రోజు ఉదయం 9 గంటల వరకు అత్యవసర కేసులు వచ్చినపుడు వైద్యులు విధులకు తప్పకుండా హాజరుకావాలి.

ఇప్పటి వరకు కొన్ని పీహెచ్‌సీల్లో మాత్రమే 24 గంటలు సేవలు అందుతున్నాయి. ఇకపై అన్నిచోట్లా నిరంతరాయంగా చికిత్స అందించేందుకు వీలుగా వేళలను మార్చారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags