Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ఏప్రిల్‌ 1 నుంచి ఏపీలో ఒంటిపూట బడులు - విద్యాశాఖ మంత్రి

 

ఏప్రిల్‌ 1 నుంచి ఏపీలో ఒంటిపూట బడులు - విద్యాశాఖ మంత్రి

ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్‌ 1 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి సురేశ్‌ తెలిపారు. 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఒక్కపూటే తరగతులని ఆయన వెల్లడించారు. ఉ.7.45 నుంచి 11.30 వరకు తరగతులు ఉంటాయని, ఆ తర్వాత మధ్యాహ్న భోజనం ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు.

ఎండలు, కరోనా కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు. ఇటీవల పాఠశాలల్లో కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కరోనా నిబంధనల అమలుపై మంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags