Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Railways Mulls Severe Penalty for Smoking in Trains If It Leads to Property Damage

 

Railways Mulls Severe Penalty for Smoking in Trains If It Leads to Property Damage

రైళ్లలో సిగరెట్‌ తాగితే భారీ జరిమానా!

రైళ్లలో సిగరెట్‌/ బీడీలు తాగే వ్యక్తులకు భారీ జరిమానా విధించేందుకు రైల్వేశాఖ సిద్ధమవుతోంది. ప్రభుత్వ ఆస్తులకు నష్టం వాటిల్లిన సందర్భాల్లో అరెస్టులు సైతం చేయాలని యోచిస్తోంది. ఇటీవల జరిగిన శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌కు చెందిన బోగీ మంటల్లో చిక్కుకోవడానికి సిగరెట్‌ లేదా బీడీ కారణమని ప్రాథమిక నివేదికలు పేర్కొంటున్న నేపథ్యంలో రైల్వే శాఖ ఆ దిశగా నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. 

ఈ నెల 13న న్యూదిల్లీ- దెహ్రాదూన్‌ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ ఎస్‌5 బోగీ మంటలు చెలరేగిన సంగతి తెలిసిందే. టాయిలెట్‌లోని డస్ట్‌బిన్‌లో గుర్తు తెలియని వ్యక్తులు సిగరెట్‌/ బీడీ వేయడం వల్ల అక్కడున్న టిష్యూ పేపర్లు నిప్పంటుకుని మంటలు చెలరేగినట్లు విచారణ జరిపిన అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఇటీవల రైల్వే బోర్డు సభ్యులతో రైల్వే మంత్రి సమావేశంలో పొగతాగే అంశం చర్చకు వచ్చింది. రైళ్లలో పొగ తాగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి సూచించారు. ఈ నేపథ్యంలో భారీ జరిమానా విధించే విషయంలో ఆలోచన చేస్తున్నామని రైల్వే అధికారి ఒకరు వెల్లడించారు. రైల్వే ఆస్తులకు నష్టం వాటిల్లినప్పుడు, తోటి ప్రయాణికులను ప్రాణాలను పణంగా పెట్టే వ్యక్తులను అరెస్టు చేసే విషయమై యోచిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం రైళ్లలో పొగతాగితే రూ.100 వరకు జరిమానా విధిస్తున్నారు. ఇక శతాబ్ది ప్రమాదం విషయం గురించి మరో అధికార మాట్లాడుతూ.. సిబ్బంది సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పిందన్నారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags