Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP Covid-19 Media Bulletin 09-04-2021

 

AP Covid-19 Media Bulletin 09-04-2021

ఏపీలో 2765 కొత్త కరోనా కేసులు

ఏపీలో కరోనా తీవ్రత మరింత పెరుగుతోంది. ఒక్కరోజు వ్యవధిలో 31,892 నమూనాలను పరీక్షించగా 2,765 మందికి కొవిడ్‌ నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 496, అత్యల్పంగా పశ్చిమగోదావరి జిల్లాలో 6 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్‌లో వెల్లడించింది. తాజా సంఖ్యతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 9,18,597కి చేరింది. 

24 గంటల వ్యవధిలో కొవిడ్‌ చికిత్స పొందుతూ 11 మంది మృతిచెందారు. అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, విశాఖపట్నం జిల్లాల్లో ఇద్దరేసి.. గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. తాజా మరణాలతో రాష్ట్రంలో కొవిడ్‌తో మృతిచెందిన వారి సంఖ్య 7,279కి చేరింది. ఒక్కరోజులో 1,245 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకోగా.. ప్రస్తుతం 16,422 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,53,65,743 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది.



Previous
Next Post »
0 Komentar

Google Tags