Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ఏపీలో పీజీ, డిగ్రీ కోర్సుల ఫీజులు ఖరారు - ఉత్తర్వులు జారీ చేసిన ఉన్నత విద్యాశాఖ

 

ఏపీలో పీజీ, డిగ్రీ కోర్సుల ఫీజులు ఖరారు - ఉత్తర్వులు జారీ చేసిన ఉన్నత విద్యాశాఖ

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రైవేటు, అన్‌ఎయిడెడ్‌ కళాశాలల్లో పీజీ, డిగ్రీ కోర్సుల ఫీజులను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. 2020-21, 2022-23 విద్యా సంవత్సరానికి కమిషన్ నిర్ధారించిన ఈ ఫీజు అమలు చేయాలని ఆదేశించింది. సైన్స్‌, ఆర్ట్స్‌ విభాగాలల్లోని పీజీ కోర్సులకు సైతం ఫీజులు ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వార్షిక ఫీజులోనే ట్యూషన్‌, అఫిలియేషన్‌, ఐడీ కార్డు, స్టడీ టూర్ ఫీజులు కలిసి ఉంటాయని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘించే విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నత విద్యాశాఖ హెచ్చరించింది. 

కోర్సులు -  వాటి వార్షిక ఫీజుల వివరాలు. 

* మాస్టర్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్ టెక్నాలజీ - రూ.27,000

* కెమిస్ట్రీ - రూ.33,000

* బయోటెక్నాలజీ - రూ.37,400

* కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ - రూ.24,200

* జెనెటిక్స్‌ - రూ.49,000

* ఎంఏ, ఎంకామ్‌ - రూ.15,000 నుంచి రూ.30,000

Higher Education – Andhra Pradesh Higher Education Regulatory and Monitoring Commission (APHERMC) – Fixation of fee structure for Post Graduate (PG) Degree courses in the Private Un-Aided Degree Colleges in the State of Andhra Pradesh for the block period 2020-21 to 2022-23 Notification- Issued. 

G.O.Ms.No.17

Dated: 15.04.2021 

DOWNLOAD G.O

Previous
Next Post »
0 Komentar

Google Tags