Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Monuments, Sites, Museums Closed till May 15 in View of Pandemic

 

Monuments, Sites, Museums Closed till May 15 in View of Pandemic

చారిత్రక కట్టడాలు, స్మారక స్థలాలు, మ్యూజియాలు తాత్కాలికంగా మూసివేత - కేంద్రం మరో కీలక నిర్ణయం

దేశంలో కరోనా వ్యాప్తి రోజురోజుకీ ఉద్ధృత రూపం దాల్చుతుండటంతో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా ఉన్న చారిత్రక కట్టడాలు, స్మారక స్థలాలు, మ్యూజియాలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు ప్రకటించింది. తక్షణమే ఈ ఆదేశాలు అమలులోకి వస్తాయని జియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వ సంరక్షణలో ఉండే స్మారక కట్టడాలు, స్థలాలు, మ్యూజియాలను మే 15వరకు మూసివేస్తున్నట్టు కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ సహాయమంత్రి (స్వతంత్ర హోదా) ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌ ట్విటర్‌లో వెల్లడించారు. 

గతేడాది కరోనా తీవ్రరూపం దాల్చిన సందర్భంలో కూడా ఈ కట్టడాలన్నీ మూసివేయగా.. వైరస్‌ తీవ్రత కాస్త తగ్గుముఖం పట్టడంతో క్రమంగా ఆంక్షలు ఎత్తివేసిన విషయం తెలిసిందే. తాజాగా గతంలో కంటే వేగంగా కరోనా 2.0 కమ్ముకొస్తోంది. బుధవారం ఒక్కరోజే 2లక్షలకు పైగా కొత్త కేసులు నమోదు కావడంతో ప్రజల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. కొవిడ్‌ను అదుపు చేసే చర్యల్లో భాగంగా మరోసారి కేంద్రం సహా పలు రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన ఆంక్షలను దశల వారీగా ప్రకటిస్తున్నాయి.



Previous
Next Post »
0 Komentar

Google Tags