Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP: మే 1 నుంచి 18ఏళ్లు దాటిన వారందరికీ ఉచిత వ్యాక్సిన్‌ - రేపటి (ఏప్రిల్ 24) నుండి రాత్రి కర్ఫ్వూ

 

AP: 18ఏళ్లు దాటిన వారందరికీ ఉచిత వ్యాక్సిన్‌ - రేపటి (ఏప్రిల్ 24) నుండి రాత్రి కర్ఫ్వూ  

18ఏళ్లు దాటిన వారందరికీ ఉచిత వ్యాక్సిన్‌

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కరోనా టీకా విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. మే 1 నుంచి 18 సంవత్సరాలు దాటిన అందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్‌ ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి ప్రకటించారు. శుక్రవారం మంత్రులు, అధికారులతో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. వ్యాక్సిన్‌ సరఫరా విషయమై సీఎం జగన్‌ ఇప్పటికే భారత్‌ బయోటెక్‌, హెటెరో డ్రగ్స్‌ ఎండీలకు ఫోన్‌ చేసి మాట్లాడారు.

రేపటి (ఏప్రిల్ 24) నుండి రాత్రి కర్ఫ్వూ 

శనివారం నుంచి రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించింది. రాత్రి 10గంటల నుంచి ఉదయం 5గంటల వరకూ అత్యవసర సేవలు మినహా మిగిలినవి ఏవీ పని చేయవు. దుకాణాలు, ప్రజా రవాణా, షాపింగ్‌ మాల్స్‌, సినిమా థియేటర్లను మూసి వేయనున్నారు. ఈ మేరకు  ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారని మంత్రి ఆళ్లనాని తెలిపారు. కర్ఫ్యూ నుంచి ఫార్మసీలు, ల్యాబ్‌లు, మీడియా, పెట్రోల్‌ బంక్‌లు, శీతల గిడ్డంగులు, గోదాములు, అత్యవసర సర్వీసులకు ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్లే రోగులకు ఎలాంటి ఆంక్షలు ఉండవు.

Previous
Next Post »
0 Komentar

Google Tags