Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS Covid-19 Media Bulletin 29-04-2021

 

TS Covid-19 Media Bulletin 29-04-2021

తెలంగాణలో 7,994 కొత్త కరోనా కేసులు

తెలంగాణలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. గడిచిన24గంటల వ్యవధిలో 80,181 మందికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా, 7,994 కొత్త కేసులు వెలుగు చూశాయి. అలాగే, ఈ మహమ్మారి బారిన పడివారిలో తాజాగా 4009 మంది కోలుకోగా, 58 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 76వేలకు పైగా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 1,28,28,763 శాంపిల్స్‌ పరీక్షించగా, 4,27,960 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరిలో 3,49,692మంది కోలుకొని డిశ్చార్జి కాగా, 2208మంది మరణించారు. ప్రస్తుతం 76,060 క్రియాశీల కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో రికవరీ రేటు 81.71శాతంగా ఉండగా, మరణాల రేటు 0.51శాతంగా ఉంది.

జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా 1630 కొత్త కేసులు వెలుగు చూడగా,  ఆ తర్వాత మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాలో 615, రంగారెడ్డి 558 కేసులు వచ్చాయి. అలాగే, 200లకు పైబడిన కొత్త కేసులను పరిశీలిస్తే.. నల్గొండ 424, సంగారెడ్డి 337, నిజామాబాద్‌ 301, సిద్దిపేట 269, మహబూబ్‌నగర్‌ 263,  జగిత్యాల్‌ 238, ఖమ్మం 213,  సూర్యాపేట 207, వికారాబాద్‌ 207, నాగర్‌కర్నూలు 206,  మంచిర్యాల్‌ 201 చొప్పున నమోదయ్యాయి.

Previous
Next Post »
0 Komentar

Google Tags