Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP Covid-19 Media Bulletin 11-05-2021

 

AP Covid-19 Media Bulletin 11-05-2021

ఏపీలో కొత్తగా 20,345  కరోనా కేసులు

ఏపీలో కరోనా కేసుల తీవ్రత మరింత పెరిగింది. ఒక్కరోజు వ్యవధిలో 86,878 నమూనాలను పరీక్షించగా 20,345 మందికి కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 2426, అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 707 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్‌లో వెల్లడించింది. తాజా సంఖ్యతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 13,22,934కి చేరింది. 

24 గంటల వ్యవధిలో కొవిడ్‌ చికిత్స పొందుతూ 108 మంది మృతిచెందారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 18 మంది, విశాఖపట్నంలో 12, తూర్పుగోదావరి, గుంటూరు, విజయనగరం జిల్లాల్లో 10 మంది చొప్పున, ప్రకాశంలో 9, నెల్లూరు 8, కృష్ణా 7, శ్రీకాకుళం 6, అనంతపురం, కర్నూలు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఐదుగురు చొప్పున, కడప జిల్లాలో ముగ్గురు మరణించారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మృతిచెందిన వారి సంఖ్య 8,899కి చేరింది. 

ఒక్కరోజు వ్యవధిలో 14,502 మంది కొవిడ్‌ నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,75,14,937 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,95,102 యాక్టివ్‌ కేసులున్నాయి.

AP BULLETIN 11-05-2021

Previous
Next Post »
0 Komentar

Google Tags