Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP Covid-19 Media Bulletin 17-05-2021

 

AP Covid-19 Media Bulletin 17-05-2021

ఏపీలో కొత్తగా 18,561  కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. తాజాగా రాష్ట్రంలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 18వేలు దాటింది. గత 24 గంటల్లో 73,749 కరోనా నిర్థారణ పరీక్షలు చేయగా, 18,561మంది కరోనా బారినపడినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక అత్యధికంగా 109 మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది.

కొవిడ్‌ బాధపడుతూ పశ్చిమగోదావరిలో అత్యధికంగా 16మంది మృత్యువాత పడగా, అనంతపురం 10, చిత్తూరు 10, గుంటూరు 10, తూర్పుగోదావరి 9, విశాఖపట్నం 9, కృష్ణా 8, నెల్లూరు 8, విజయనగరం 8, కర్నూలు 7, శ్రీకాకుళం 7, ప్రకాశం 4, కడపలో ముగ్గురు కన్నుమూశారు. గడిచిన 24 గంటల్లో 17,334మంది కొవిడ్‌ నుంచి కోలుకున్నారు.

ఇప్పటివరకూ రాష్ట్రంలో 1,80,49,054 శాంపిల్స్‌ పరీక్షించగా, 14,54,052 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 2,11,554 యాక్టివ్‌ కేసులు ఉండగా, కరోనాతో బాధపడుతూ 9,481మంది మృత్యువాతపడ్డారు.

AP BULLETIN 17-05-2021

Previous
Next Post »
0 Komentar

Google Tags