Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

‘వందే భారత్‌ మిషన్‌’లో భాగంగా విజయవాడ రానున్న విదేశీ విమానాలు - జూన్‌ 2 నుంచి నేరుగా విదేశీ సర్వీసులు

 

‘వందే భారత్‌ మిషన్‌’లో భాగంగా విజయవాడ రానున్న విదేశీ విమానాలు - జూన్‌ 2 నుంచి నేరుగా విదేశీ సర్వీసులు 

కొవిడ్‌ నేపథ్యంలో చేపడుతోన్న ‘వందే భారత్‌ మిషన్‌’లో భాగంగా జూన్‌ 2వ తేదీ నుంచి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి నేరుగా విదేశీ సర్వీసులు ప్రారంభంకానున్నాయి. ప్రవాసాంధ్రులు అధికంగా ఉండే కువైట్‌, మస్కట్‌, సింగపూర్‌ల నుంచి తొలుత ఈ సర్వీసులు ప్రారంభించనున్నారు. ఆదివారం మినహా ఇతర రోజుల్లో నిత్యం ఒకటి, రెండు సర్వీసులు రాష్ట్రానికి చేరనున్నాయి.

ఇప్పటివరకు దిల్లీ మీదుగా ఈ సర్వీసులు ఉండేవని, ఇప్పుడు ఆయా దేశాల నుంచి నేరుగా ఇక్కడికి చేరుకోనున్నట్లు విమానాశ్రయ డైరెక్టర్‌ మధుసూదనరావు తెలిపారు. విజయవాడ నుంచి కూడా నేరుగా ఆయా దేశాలకు ప్రయాణికులను తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. జులై 1వ తేదీ నుంచి ఈ ప్రక్రియ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags