Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

After DA, HRA Also Increased for Central Government Employees

 

After DA, HRA Also Increased for Central Government Employees

కేంద్ర ఉద్యోగులకు హెచ్‌ఆర్‌ఏ (HRA) పెంపు -  ఆగస్టు నుంచి అమలు

డియర్‌నెస్ అవెన్స్ DA (డీఏ) పెంపునకు ఆమోదంతో ఉద్యోగులకు ఇప్పటికే తీపికబురు అందించిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మరో శుభవార్త అందించింది. అదిరిపోయే బొనాంజా తీసుకువచ్చింది. కీలక నిర్ణయం తీసుకుంది.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు జూలై 1 నుంచి కరువు భత్యాన్ని ప్రస్తుతం ఉన్న 17 శాతం నుంచి 28 శాతానికి ఇటీవల పెంచిన కేంద్రం మరో బొనంజా ప్రకటించింది. తాజా సమాచారం ప్రకారం, ప్రభుత్వ ఉద్యోగాలకు హౌస్ రెంట్ అలవెన్స్ (హెచ్ఆర్ఏ)ను కూడా పెంచింది. రివైజ్ చేసిన హెచ్ఆర్ఏను ఆగస్టు నుంచి ఉద్యోగులు అందుకోనున్నారు. డీఏ 25 శాతం దాటినందున హెచ్ఆర్ఏ పెంచినట్టు కేంద్రం పేర్కొంది.

ప్రభుత్వ ఉత్తర్వు ప్రకారం, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు వారు నివససిస్తున్న సిటీలను బట్టి వివిధ కేటగిరిలుగా హెచ్ఆర్ఏను అందుకుంటారు. ఎక్స్ కేటగిరీ సిటీల్లో ఉన్నవాళ్లకు 27 శాతం, వై, జడ్ కేటగిరీలకు 19, 9 శాతం పెంపు ఉంటుంది. డీఏ 50 శాతం దాటితే హెచ్ఆర్ఏ రేట్లు కేటగిరీలను బట్టి 30 శాతం, 20 శాతం, 10 శాతంగా రివైజ్ అవుతాయి. 50 లక్షలకు పైగా ఉన్న జనాభా ఉన్న ఉంటే ఎక్స్ కేటగిరి సిటీ కింద పరిగణిస్తారు. 5 లక్షలకు పైగా  జనాభా ఉంటే వై కేటగిరి, 5 లక్షల కంటే తక్కువ జనాభా ఉంటే జడ్ కేటగిరిగా పరిగణిస్తారు.

ఇకపోతే కేంద్ర ప్రభుత్వం ఇటీవలనే ఉద్యోగులకు డీఏ పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. డీఏ 11 శాతం పెరిగింది. దీంతో ఉద్యోగులకు డీఏ 17 శాతం నుంచి 28 శాతానికి చేరింది. బేసిక్ శాలరీ ప్రాతిపదికన ఉద్యోగుల డీఏ లెక్కిస్తారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags