Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

APSRTC - TTD: ఏపీఎస్‌ఆర్టీసీ ద్వారా శ్రీవారి దర్శన టికెట్లు

 

APSRTC - TTD: ఏపీఎస్‌ఆర్టీసీ ద్వారా శ్రీవారి దర్శన టికెట్లు

తిరుమల శ్రీనివాసుని దర్శించుకునే అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) కల్పిస్తోంది. ఇందుకోసం ప్రతి రోజు 1,000 టికెట్లను ప్రయాణికులకు అందుబాటులో ఉంచుతోంది. తిరుమల ప్రయాణాలకు ఆన్‌లైన్‌ ద్వారా ముందస్తు రిజర్వేషన్‌ చేసుకున్న భక్తులు టిక్కెట్ ఛార్జీలతోపాటు రూ.300 అదనంగా చెల్లించి శీఘ్రదర్శనం టికెట్టు పొందొచ్చు. 

ఈ టికెట్లు పొందిన భక్తులకు ప్రతిరోజు ఉదయం 11 గంటలు, సాయంత్రం 4 గంటల స్లాట్లలో శ్రీవారి దర్శనం కల్పిస్తున్నారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ అధికారులు కోరుతున్నారు. తిరుమల బస్‌ స్టేషన్‌ చేరుకున్న తర్వాత శీఘ్రదర్శనం టికెట్లు పొందిన వారికి ఆర్టీసీ సూపర్‌వైజర్లు సహాయం చేస్తారు. తిరుపతి వెళ్లే ప్రయాణికులు దర్శనం విషయంలో ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు.. శీఘ్ర దర్శనం టికెట్లను ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి అందుబాటులో ఉంచింది. 

కాగా, కరోనా రెండో దశ వ్యాప్తి క్రమంగా తగ్గుతుండటంతో శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో దూర ప్రాంతాలకు ఏపీఎస్‌ఆర్టీసీ ముందస్తు రిజర్వేషన్లు ప్రారంభించింది. కోవిడ్-19కు ముందు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి రోజూ 650 బస్సుల్ని తిరుపతికి నడుపుతోంది. బెంగళూరు, చెన్నై, కంచి, నెల్లూరు, పాండిచ్చేరి, హైదరాబాద్‌ నుంచి వచ్చే ప్రయాణికులు అడ్వాన్స్‌డ్‌ రిజర్వేషన్‌తో పాటు శీఘ్రదర్శన టికెట్లు పొందవచ్చు.

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags