Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ఏ‌పి: నేటి నుంచి ప్రభుత్వ పాఠశాలలకు ఉపాధ్యాయుల హాజరు – ప్రొసీడింగ్స్ మరియు ఇతర వివరాలు ఇవే

 

ఏ‌పి: నేటి నుంచి ప్రభుత్వ పాఠశాలలకు ఉపాధ్యాయుల హాజరు – ప్రొసీడింగ్స్ మరియు ఇతర వివరాలు ఇవే

ప్రభుత్వ పాఠశాలల్లోని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిబ్బంది అందరూ గురువారం పాఠశాలలకు హాజరు కావాలని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రాజశేఖర్ ఆదేశాలు జారీ చేశారు. కరోనా కర్ప్యూ , వేసవి సెలవుల తర్వాత మొదటిసారిగా ఉపాధ్యాయులు బడులకు హాజరుకానున్నారు. ఉపాధ్యాయులు మొదటి రోజు ప్రవేశాలు, విద్యార్థుల వివరాల నమోదుతో పాటు ఆన్ లైన్ తరగతులకు వాట్సప్ గ్రూపు, డిజిటల్ కంటెంట్ సిద్ధం చేసుకోవాలి.

* శుక్రవారం నుంచి ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులు రోజు విడిచి రోజు బడులకు వెళ్లాలి.

* పాఠశాలలోని పని ఆధారంగా ఎవరు ఏ రోజు బడికి రావాలనే దాన్ని ప్రధానోపాధ్యాయులు నిర్ణయిస్తారు.

* ఉన్నత పాఠశాలల్లో 50% సిబ్బంది రోజూ హాజరు కావాలి. ఉపాధ్యాయులను అనుసరించి ప్రధానోపాధ్యాయులు నిర్ణయం తీసుకుంటారు.

* పంచాయతీరాజ్, పురపాలక విభాగాలను సంప్రదించి ప్రధానోపాధ్యాయులు పాఠశాలను శానిటైజ్ చేయించాలి.

* జులై 15 నుంచి ఆన్లైన్ తరగతులు నిర్వహించేందుకు అడకమిక్ ప్రణాళికను రూపొందించాలి.

* 15 నుంచి రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్టీ) వర్క్ షీట్లను సరఫరా చేస్తుంది. వీటిని విద్యార్థుల తల్లిదండ్రులకు ఇచ్చి ఇళ్లకు పంపించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యార్థులను బడులకు పిలవరాదు.


AP: జూలై 1వ తేదీ నుంచి పాఠశాల పని విధివిధానాలపై పాఠశాల విద్యా శాఖ ఉత్తర్వులు విడుదల

Previous
Next Post »
0 Komentar

Google Tags