Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Centre Approves 3% DA Hike for Central Govt Employees

 

Centre Approves 3% DA Hike for Central Govt Employees

DA: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండుగ కానుక, డీఏ పెంపు – వివరాలు ఇవే

UPDATE ON 26-10-201

కేంద్ర ఉద్యోగుల డీఏ పెంపుపై ఉత్తర్వులు విడుదల

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కరవు భత్యం (డియర్‌నెస్‌ అలవెన్స్‌-డీఏ)ను పెంచుతున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ఇంతవరకు మూలవేతనంపై 28 శాతం మేర ఇస్తున్న డీఏను 31 శాతానికి పెంచుతున్నట్టు తెలిపింది. ఇది ఈ ఏడాది జులై ఒకటో తేదీ నుంచే అమల్లోకి వచ్చే విధంగా ఈ ఆదేశాలు ఇచ్చింది.

DOWNLOAD MEMO

===========================

ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరవు భత్యం(డీఏ)ను 3శాతం పెంచింది. ఈ మేరకు గురువారం జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ వివరాలను కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ వెల్లడించారు. ఉద్యోగులకిచ్చే డీఏ, పెన్షనర్లకు ఇచ్చే డీఆర్‌ను 3శాతం పెంచుతున్నట్లు తెలిపారు. ఈ పెంపు జులై 2021 నుంచే అమలవుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 28శాతం ఉండగా.. తాజా నిర్ణయంతో 31శాతానికి చేరింది.

కేంద్ర నిర్ణయంతో 47.14 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 68.62 లక్షల మంది పింఛనుదారులకు ప్రయోజనం కలగనుంది. డీఏ పెంపుతో కేంద్ర ఖజానాపై ఏటా రూ.9,488.70కోట్ల మేర అదనపు భారం పడనుంది. కరోనా మహమ్మారితో నెలకొన్న సంక్షోభం దృష్ట్యా గతేడాది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరవు భత్యాన్ని నిలిపివేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జులై నుంచి దాన్ని పునరుద్ధరించడమే గాక.. 17శాతం ఉన్న డీఏను 28శాతానికి పెంచారు. ఇప్పుడు మరో 3శాతం పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.

Previous
Next Post »
0 Komentar

Google Tags