Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP: ఆ ఉద్యోగులందరికీ బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి

 

AP: ఆ ఉద్యోగులందరికీ బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి

ఏపీ సచివాలయంలో ప్రభుత్వం ఉద్యోగులందరికీ బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి చేస్తూ రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ మెమో జారీ చేసింది. కొవిడ్ ఉద్ధృతి అనంతరం సాధారణ పరిస్థితుల దృష్టా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉద్యోగుల హాజరు పరిశీలించాలని ఆదేశాలిచ్చింది.

ఉదయం 10 తర్వాత వస్తే ఆలస్యంగా హాజరైనట్లు పరిగణిస్తామని, నెలలో మూడుసార్లు మాత్రమే ఈ ఆలస్య హాజరును అనుమతిస్తామని ప్రభుత్వం పేర్కొంది. ఉదయం 10 నుంచి సాయంత్రం 5.30 వరకు విధుల్లో ఉంటేనే పూర్తి హాజరుగా నమోదు చేస్తామని స్పష్టం చేసింది.

Previous
Next Post »
0 Komentar

Google Tags