Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

RGUKT-AP: ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు తరగతుల నిర్వహణ తేదీలలో మార్పులు – వివరాలు ఇవే

 

RGUKT-AP: ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు తరగతుల నిర్వహణ తేదీలలో మార్పులు – వివరాలు ఇవే

ఆర్జీయూకేటీ పరిధిలోని ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలలో కొవిడ్ నేపథ్యంలో నాలుగు ట్రిపుల్ ఐటీలలో విద్యార్థులకు తరగతుల నిర్వహణ తేదీలను మార్పు చేసినట్లు వర్సిటీ కులపతి ఆచార్య కేసిరెడ్డి తెలిపారు.

* పీయూసీ-1 చదివే విద్యార్థులు ఫిబ్రవరి 12, 13 తేదీలలో క్యాంపస్ కు వస్తే వారికి 14 నుంచి తరగతులు నిర్వహిస్తారన్నారు.

* పీయూసీ-2 చదివే విద్యార్థులు ఫిబ్రవరి 5, 6 తేదీలలో క్యాంపస్ కు వస్తే వారికి ఏడో తేదీ నుంచి తరగతులుంటాయన్నారు.

* అన్ని క్యాంపస్లలో ఇంజినీరింగ్ తృతీయ సంవత్సరం విద్యార్థులు ఫిబ్రవరి 19న క్యాంపస్లలో రిపోర్టు చేసుకుంటే వారికి 20 నుంచి తరగతులు నిర్వహిస్తారని తెలియజేశారు.

* ఇంజినీరింగ్ మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా తరగతులుంటాయన్నారు.

* ప్రస్తుతం ఇడుపులపాయ, నూజివీడులలో ఇంజినీరింగ్ చివరి సంవత్సరం విద్యార్థులకు సోమవారం (Jan 31) నుంచి మిడ్ వన్ పరీక్షలుంటాయని వివరించారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags