Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

UPSC Civil Services Exam 2022: Results Released

 

UPSC Civil Services Exam 2022: Results Released

యూపీఎస్సీ-సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్, 2022 – ప్రిలిమ్స్ పరీక్షా ఫలితాలు విడుదల  

===================

UPDATE 22-06-2022

అఖిల భారత సర్వీసుల్లోకి ఉద్యోగుల ఎంపిక కోసం యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్ 2022 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. సివిల్స్ మెయిన్స్ కు మొత్తం 13,090 మంది అభ్యర్థులను ఎంపిక చేసినట్లు యూపీఎస్సీ వెల్లడించింది. సెప్టెంబర్ 16 నుంచి 21 వరకు సివిల్స్ మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది.

CLICK FOR RESULTS

WEBSITE

===================

UPDATE 20-02-2022

యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్-2022 నోటిఫికేషన్ పోస్టుల సంఖ్యను పెంచింది. ఫిబ్రవరి రెండో తేదీన 861 పోస్టులతో ఇచ్చిన నోటిఫికేషన్‌కు మరో 150 పోస్టులను పెంచుతూ అనుబంధ ప్రకటన విడుదల చేసింది. కాగా ఈ పోస్టుల సంఖ్య 1,011 కు చేరింది. ఇండియన్ రైల్వే మేనేజ్ మెంట్ సర్వీస్ (ఐఆర్ఎంఎస్)లో ఈ 150 ఖాళీలను యూపీఎస్సీ భర్తీ చేయనుంది. పూర్తి వివరాలకు యూపీఎస్సీ వెబ్ సైట్ ని చూడవచ్చు.

NOTICE 17-02-2022

===================

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) వివిధ సివిల్ సర్వీసుల ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.

సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్, 2022

మొత్తం పోస్టుల సంఖ్య: 861, 1011

అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయసు: 01.08.2022 నాటికి 21 ఏళ్లు తగ్గకుండా, 32 ఏళ్లు మించకుండా ఉండాలి. 02.08.1990 - 01.08.2001 మధ్య జన్మించి ఉండాలి.

ప్రయత్నాల సంఖ్య: ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు అన్‌లిమిటెడ్, ఓబీసీ అభ్యర్థులకు-9 ప్రయత్నాలు.

ఎంపిక: రాతపరీక్ష (ప్రిలిమినరీ, మెయిన్స్), ఇంటర్వ్యూ /పర్సనాలిటీ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

ప్రిలిమినరీ పరీక్ష: దీనిలో రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కోదానికి 200 మార్కులు కేటాయిస్తారు. రెండు పేపర్లలో ప్రశ్నలు ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ ఛాయిస్ రూపంలో ఉంటాయి. పరీక్షా సమయం రెండు గంటలు. ప్రిలిమినరీ పరీక్షలో పేపర్-2 జనరల్ స్టడీస్ క్వాలిఫైయింగ్ పేపర్ గా ఉంటుంది. దీనిలో 33% అర్హత మార్కులు సాధించాల్సి ఉంటుంది. దీనికి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రిలిమ్స్ లో అర్హత సాధించిన అభ్యర్థులను మెయిన్స్ పరీక్షకు ఎంపిక చేస్తారు. మెయిన్స్ పరీక్షను మొత్తం 2025 మార్కులకు నిర్వహిస్తారు. దీనికి సంబంధించిన పేపర్లు, సిలబస్, ఇతర పూర్తి వివరాలు ప్రకటనలో చూడవచ్చు.

ప్రిలిమ్స్ పరీక్ష తేది: 05.06.2022.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: ఇతరులు రూ.100 చెల్లించాలి. మహిళా / ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు.

ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 02.02.2022.

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 22.02.2022.

NOTIFICATION

APPLY HERE

JOB DETAILS PAGE

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags