Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

'Azadi Ka Amrit Mahotsav' Turning into Mass Movement: PM Modi

 

'Azadi Ka Amrit Mahotsav' Turning into Mass Movement: PM Modi

ఆగస్టు 2-15వ తేదీల మధ్య ప్రతి ఒక్కరూ తమ సోషల్ మీడియా ఖాతాల ప్రొఫైల్ పిక్చర్ గా త్రివర్ణ పతాకాన్ని ఉంచాలని పిఎం మోదీ పిలుపు

మన్ కీ బాత్ రేడియో ప్రసంగం వివరాలు ఇవే

మన దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు గడుస్తున్న వేళ నిర్వహిస్తున్న 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుక ప్రజా ఉద్యమంగా అవతరిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 2-15వ తేదీల మధ్య ప్రతి ఒక్కరూ తమ సోషల్ మీడియా ఖాతాల ప్రొఫైల్ పిక్చర్ గా త్రివర్ణ పతాకాన్ని ఉంచాలని పిలుపునిచ్చారు.

ప్రతినెలా నిర్వహించే రేడియో ప్రసంగం మన్ కీ బాత్ లో ఈ మేరకు ఆయన ప్రజలను కోరారు. అలాగే, ఆగస్టు 13-15 మధ్య ఇంటింటా మువ్వన్నెల జెండాను ఎగురవేయాలని ప్రధాని కోరారు. ఫలితంగా ఆజాదీకా అమృత్ మహోత్సవ్ స్ఫూర్తిని మరింత ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు ఈ ఉత్సవాల్లో ఏదో రూపంలో పాల్గొంటున్నారని ఆయన అన్నారు.

* ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా కర్ణాటకలో ‘'అమృత భారతి కన్నడార్తి' పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించినట్లు మోదీ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 75 ప్రదేశాల్లో.. ఆయా ప్రాంతాలకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుల్ని స్మరించుకుంటూ ప్రత్యేక కార్యక్రమాల్ని నిర్వహించినట్లు వెల్లడించారు.

* స్వాతంత్ర్య పోరాటంలో రైల్వేల ప్రాముఖ్యతను వివరిస్తూ 'ఆజాదీ కా రైల్ గాడీ' పేరిట ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ప్రధాని పేర్కొన్నారు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 75 రైల్వే స్టేషన్లను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దినట్లు వెల్లడించారు.

* మువ్వన్నెల జెండా రూపకర్త పింగళి వెంకయ్య జయంతి ఆగస్టు 2నే అని ఈ సందర్భంగా ప్రధాని గుర్తుచేశారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు నిండిన సందర్భంగా ఆయనకు ప్రత్యేక నివాళులర్పించారు. అలాగే త్రివర్ణ పతాక రూపకల్పనలో మేడం కామా కూడా కీలక పాత్ర పోషించినట్లు స్మరించుకున్నారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags