Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

CAT 2022: Common Admission Test – All the Details Here

 

CAT 2022: Common Admission Test – All the Details Here

క్యాట్-2022: కామన్ అడ్మిషన్ టెస్ట్ – పూర్తి వివరాలు ఇవే

========================

UPDATE 22-12-2022

ఫలితాలు విడుదల 

ఐఐఎంలు, ఇతర మేనేజ్మెంట్ విద్యాసంస్థల్లో ప్రవేశానికి నిర్వహించిన కామన్ అడ్మిషన్ టెస్టు (క్యాట్) ఫలితాలను ఐఐఎం, బెంగళూరు బుధవారం విడుదల చేసింది.

దేశవ్యాప్తంగా 11 మంది 100, 22 మంది 99.99 పర్సంటైల్ స్కోర్ సాధించారు. 100 పర్సంటైల్ సాధించిన విద్యార్థుల్లో ఇద్దరు తెలంగాణకు చెందిన వారున్నారు. టాపర్ల పేర్లను ఐఐఎం, బెంగళూరు వెల్లడించకపోవడంతో వారి వివరాలు తెలియరాలేదు. నవంబరు 27'క్యాట్ నిర్వహించగా 2.22 లక్షల మంది హాజరయ్యారు. ఈ స్కోర్ ఆధారంగా ఐఐఎంలు బృంద చర్చలు, ముఖాముఖి నిర్వహించి సీట్లు ఇస్తాయి.

DOWNLOAD SCORE CARD

WEBSITE

========================

కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్)-2022 ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్(ఐఐఎం) కళాశాలలో మేనేజ్ మెంట్ కోర్సులు చేసేందుకు అవకాశం కల్పించే ప్రవేశ పరీక్షే కామన్ అడ్మిషన్ టెస్ట్(క్యాట్). దేశవ్యాప్తంగా ఉన్న ఐఐఎం కళాశాలలే స్వయంగా ఈ ప్రవేశపరీక్ష నిర్వహిస్తాయి. ఆన్ లైన్ కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించే క్యాట్ లో సాధించిన పర్సంటైల్ ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. క్యాట్ స్కోరు ఆధారంగా ఐఐఎంలే కాకుండా పేరున్న కళాశాలలు కూడా తమ కళాశాలల్లో సీట్లను భర్తీ చేస్తాయి.

దేశవ్యాప్తంగా ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్లు: అహ్మదాబాద్, అమృత్ సర్, బెంగళూరు, బోధ్ గయా, కోల్ కతా, ఇండోర్, జమ్ము, కాశీపూర్, కోజికోడ్, లఖ్నవూ, నాగపుర్, రాయ్ పూర్, రాంచీ, రోహ్ తక్, సంబల్ పూర్, షిల్లాంగ్, సిర్మౌర్, తిరుచిరాపల్లి, ఉదయపూర్, విశాఖపట్నం.

కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్)-2022:

అర్హత: కనీసం 50% మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 45% మార్కులు ఉన్నా అర్హులే). డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని పరీక్షా కేంద్రాలు: చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం , విజయనగరం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్. ఈ ఏడాది దేశవ్యాప్తంగా మొత్తం 150 నగరాల్లో పరీక్ష నిర్వహించనున్నారు.

పరీక్ష విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో నిర్వహిస్తారు. పరీక్షలో మూడు విభాగాలు ఉంటాయి. వర్బల్ ఎబిలిటీ అండ్ రీడింగ్ కాంప్రెహెన్షన్, డేటా ఇంటర్ ప్రిటేషన్ అండ్ లాజికల్ రీజనింగ్, క్వాంటిటేటివ్ ఎబిలిటీలో విభాగాల్లో ప్రశ్నలుంటాయి. ప్రతి ప్రశ్నకు మూడు మార్కులు ఉంటాయి. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి బృంద చర్చలు, రిటెన్ ఎబిలిటీ టెస్ట్, ముఖాముఖి నిర్వహించి ఎంపిక చేస్తారు.

రిజిస్ట్రేషన్ ఫీజు: రూ.2300 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.1150 చెల్లించాలి).

ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ తేదీలు: 03-08-2022 నుంచి 14-09-2022 వరకు.

అడ్మిట్ కార్డ్ డౌన్ లోడ్: 27-10.022 నుంచి

పరీక్ష తేది: 27-11-2022

REGISTER

LOGIN

NOTIFICATION

INFORMATION BULLETIN

WEBSITE 

Previous
Next Post »
0 Komentar

Google Tags